బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లతో నాలుగు వోటో స్మార్ట్‌ఫోన్లు

Published on Sat, 12/29/2018 - 19:39

సాక్షి, ముంబై: వోటో మొబైల్స్ కంపెనీ  వరుసగా నాలుగు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.  వి11, వి12, వి3, వి5ఎక్స్ పేరుతో, బడ్జెట్‌ ధరల్లో భార‌త మార్కెట్‌లో తాజాగా లాంచ్‌  చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆప‌రేటింగ్ సిస్టం,  క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్ , డ్యుయల్‌ సెల్ఫీ కెమెరా లాంటి మంచి ఫీచర్లును వీటిల్లో పొందుపర్చింది. నాలుగు స్మార్ట్‌ఫోన్లను బ్లాక్‌, బ్లూ, రెడ్‌, షాంపైన్‌ కలర్స్‌లలో అందుబాటులోకి తెచ్చింది.  అలాగే నాలుగు డివైస్‌లలో 128జీబీ దాకా  స్టోరేజ్‌ను విస్తరించుకునే  అవకాశాన్ని ఇచ్చింది. 

వోటో 11  
5 అంగుళాల డిస్‌ప్లే
8 ఎంపీ రియర్‌  కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
16 జీబీ స్టోరేజ్‌
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

వోటో వి3
5.2 అంగుళాల డిస్‌ప్లే
13 ఎంపీ రియర్‌ కెమెరా 
16 జీబీ స్టోరేజ్‌
13+2 ఎంపీ డ్యుయల్‌ సెల్ఫీ కెమెరా 
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

వోటో వి12 
5అంగుళాల డిస్‌ప్లే 
క్వార్డ్‌ కోర్‌ 1.3గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌
720 x 1280  రిజల్యూషన్‌
2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌
13ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ఫింగర్‌  ప్రింట్‌ సెన్సర్‌ 



వోటో వి5 ఎక్స్‌
 5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
13+2 ఎంపీ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
16 జీబీ స్టోరేజ్‌
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సర్‌

ధరలు : వోటో వి11, వి12, వి3, వి5ఎక్స్ ఫోన్ల ధ‌రలు రూ.4,999 - రూ.6,999 మధ్య ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటెయిల్ స్టోర్స్‌లో  ఈస్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ