వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..
Breaking News
భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు
Published on Fri, 10/26/2018 - 15:00
సాక్షి, ముంబై: నవంబరు సిరీస్ ఆరంభం భారీ నష్టాలతో నిరాసపర్చింది. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మధ్యంలో కాస్త పుంజుకున్నా..ఒడిదుడుకులు మాత్రం తప్పలేదు. తొలుత 350 పాయింట్లకుపైగా పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం ప్రస్తుతం 206 పాయింట్లు క్షీణించి 33483వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 10,065 వద్ద కొనసాగుతున్నాయి
ఆటో, పీఎస్యూ నామమాత్రపు లాభాల్లోనూ, ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ నష్టాల్లోనూట్రేడ్అవుతున్నాయి. యస్బ్యాంక్కు ఫలితాల సెగ తాకగా, హెచ్సీఎల్ టెక్, జీ, యాక్సిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. టాటా మోటార్స్, టైటన్, ఆర్ఐఎల్, టాటా స్టీల్, హీరో మోటో, యూపీఎల్, ఎయిర్టెల్, ఐబీ హౌసింగ్, అల్ట్రాటెక్, ఎస్బీఐ లాభపడుతన్నాయి.
మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి జోరుగా ఉంది. పది గ్రా. 225 రూపాయలు పుంజుకుని 32, 086 వద్ద ఉంది.
Tags