అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎస్బీఐ బల్క్ డిపాజిట్లపై వడ్డీ పెంపు!
Published on Wed, 01/31/2018 - 01:06
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.కోటి పైబడిన బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటును మంగళవారం పెంచింది. 75 నుంచి 140 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెంచామని, తక్షణం ఈ పెంపు అమల్లోకి వస్తుందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది నవంబర్లో కూడా ఎస్బీఐ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నెల్లో కోటి, ఆపైబడిన డిపాజిట్లపై వడ్డీరేటును ఒక శాతం పెంచింది.
♦ తాజా మార్పులతో స్వల్పకాల బల్క్ డిపాజిట్ (46–179 రోజులు అలాగే 180– 210 రోజులు) రేటు 4.85 నుంచి 6.25 శాతానికి చేరింది.
♦ ఏడాది నుంచి రెండేళ్ల రేటు 5.25 శాతం నుంచి 6.25 శాతానికి పెరుగుతుంది.
♦ రెండు నుంచి పదేళ్ల కాలానికి డిపాజిట్ రేటు 5.25 శాతం నుంచి 6 శాతానికి పెరుగుతుంది.
#
Tags