పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
త్వరలో రూ.20 కొత్త నోటు
Published on Sat, 04/27/2019 - 13:23
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్లో ఉండే ఈ నోట్లు.. ఆకుపచ్చ, పసుపు కలిసిన రంగులో ఉన్నాయి. ఈ నోటు నమూనాను ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఈ నమూన ప్రకారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంది. అలాగే అశోకుడి స్థూపం కూడా ఉంది. ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్ లోగో, నినాదం ఉన్నాయి. ఈ నోటు సైజు 63 mm x 129 mm గా ఉండనుంది. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.10, రూ.100 విలువచేసే కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే.
#
Tags