amp pages | Sakshi

వ్యాపారం గాడిలో పడింది

Published on Fri, 06/19/2020 - 09:48

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడిపరమైన లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో దేశీయంగా వ్యాపార కార్యకలాపాలు వేగంగా మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా వైరస్‌ మహమ్మారి ముందు స్థాయికి వినియోగం, డిమాండ్‌ మెరుగుపడుతోందని ఆయన తెలిపారు. మే ఆఖరు వారం, జూన్‌ తొలి వారంలో నమోదైన విద్యుత్, ఇంధనం ఇతరత్రా ఉత్పత్తుల వినియోగానికి సంబంధించిన డేటా ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వాణిజ్య మైనింగ్‌ కోసం బొగ్గు బ్లాకుల వర్చువల్‌ వేలం ప్రక్రియను గురువారం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘తాజా గణాంకాలన్నీ కూడా భారత ఎకానమీ వేగంగా రికవర్‌ అయ్యేందుకు సన్నద్ధమవుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. భారత్‌ గతంలో ఎన్నో పెద్ద సంక్షోభాల నుంచి బైటపడింది. దీన్నుంచి కూడా బైటపడుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  గ్రామీణ ఎకానమీ కూడా వేగంగా కోలుకుం టోందని ప్రధాని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఖరీఫ్‌ పంట విస్తీర్ణం 13 శాతం పెరిగిందని, ఈ ఏడాది గోధుమల ఉత్పత్తి, కొనుగోలు కూడా భారీగా పెరిగిందని ఆయన తెలిపారు.  

స్వయంసమృద్ధి సాధిస్తాం..
భార™Œ  కచ్చితంగా వృద్ధి, స్వయంసమృద్ధి సాధిం^è గలదని ప్రధాని తెలిపారు. ‘కొన్ని వారాల క్రితం దాకా మనం ఎన్‌–95 ఫేస్‌ మాస్కులు, కరోనా టెస్టింగ్‌ కిట్లు, వ్యక్తిగత సంరక్షణ సాధనాలు, వెంటిలేటర్లను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మేకిన్‌ ఇండియా ద్వారా దేశీయంగా డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. త్వరలోనే కీలకమైన వైద్య ఉత్పత్తుల ఎగుమతిదారులుగా కూడా మారగలం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత చరిత్రను, రాతను తిరగరాయడానికి కార్పొరేట్‌ రంగానికి ఒక అవకాశం దొరికిందని, దీన్ని వదులుకోవద్దని ప్రధాని సూచించారు. భారత్‌ను పురోగతి వైపు నడిపించాలని, స్వయంసమృద్ధి సాధించేలా తోడ్పడాలని పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా మిగిలే వేల కోట్ల రూపాయలను పేదల సంక్షేమానికి వినియోగించవచ్చన్నారు. మనం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వాటినే రేపు భారీగా ఎగుమతి చేసే స్థాయికి చేరాలని, సంక్షోభాన్ని మనం అవకాశంగా మల్చుకోవాలని సూచించారు. 

బొగ్గు ఎగుమతి దేశంగా ఎదగాలి ..
అపార నిల్వలున్న భారత్‌ త్వరలో ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఎగుమతి దేశంగా ఎదగాలని   మోదీ ఆకాంక్షించారు. బొగ్గు వాణిజ్య మైనింగ్‌ను అనుమతించడం ఆ దిశగా వేసిన అడుగేనని  చెప్పారు. 41 బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను మోదీ ప్రారంభించారు. దీనితో వచ్చే 5–7 ఏళ్లలో దేశంలోకి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రాగలవని చెప్పారు. బొగ్గు నిల్వల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. ఎగుమతుల సంగతి అటుంచి.. అత్యధికంగా బొగ్గు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉంటోం దన్నారు. ఈ పరిస్థితి మారుతుందని, భారత్‌ అతి పెద్ద బొగ్గు ఎగుమతి దేశంగా మారగలదని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకుల వేలంతో రాష్ట్రాలకూ భారీగా ఆదాయం వస్తుందని, ఉపాధి కల్పనకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు.

ఎకానమీకి ఊతం..
బొగ్గు రంగంలో ప్రైవేట్‌ సంస్థలను అనుమతించడం వల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుంది, బొగ్గు దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు మరింత ఊతం లభించగలదని తెలిపాయి. ‘దేశ సహజ వనరులను వెలికి తీసే దిశగా ఇది కీలక సంస్కరణ‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి తెలిపారు. బొగ్గు రంగంలో కొత్త పెట్టుబడులు, సాంకేతికతను తెచ్చేందుకు ఇది దోహదపడగలదని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో దేశ జీడీపీలో మైనింగ్‌ రంగం వాటా 5 శాతానికి పెరగగలదని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని, వెనుకబడిన ప్రాంతాల్లోని వారికి ఉపాధి లభించగలదని వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు.  

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)