amp pages | Sakshi

స్టార్టప్ కంపెనీలు నిలదొక్కుకోవాలంటే...

Published on Sat, 02/13/2016 - 18:12

*ఐఎంటి ఓర్టస్ సదస్సులో వక్తల అభిప్రాయం

హైదరాబాద్ :ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు విజయవంతం కావాలంటే కొన్ని సూత్రాలకే లోబడే వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటి), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ’భారత్‌లో స్టార్టప్ కంపెనీలకు ఉన్న అవకాశాలు –నిలదొక్కుకొనే సమర్ధత’  అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వాణిజ్యరంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

 

కొత్త కంపెనీలకు ఉండాల్సిన నైపుణ్యత, లక్షణాలు, సాధించాలనే లక్ష్యం, నూతన ఆవిష్కరణల కోసం పరుగులు తీసే సమర్ధత ఉన్నప్పుడే  విజయాన్ని కైవసం చేసుకోగలవని ప్యానల్‌లో ఉన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఇండియాలో స్టార్టప్ కంపెనీలు నిలదొక్కుకోవాలంటే కొన్ని లక్ష్యాలను అధికమించాలని వారు పేర్కొన్నారు. సరైన వ్యాపార వాతవరణాన్ని సృష్టించుకోగలగటంతో పాటు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉంటేనే స్టార్టప్ కంపెనీలు విజయవంతం కాగలుగుతాయని ఐఎంటి డైరక్టర్ డా.. సతీష్ ఐలవాడి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విద్యారంగం, పరిశ్రమ వర్గాలు సమిష్టిగా కృషిచేస్తేనే స్టార్టప్ కంపెనీలు ధృడంగా రూపొందుతాయని ఆయన అన్నారు.  

సాధించాలనే బలమైన లక్ష్యంతోపాటు పరిశ్రమల్లో వస్తున్న మార్పులను గమనించకల్గిన ముందుచూపు అవసరమని ఆర్‌ఏ కెమ్ ఫార్మా డైరక్టర్  శిరీష్ కుమార్ రావుల అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలు ఎదుర్కోంటున్న సమస్యలను ఎడ్వాంటా సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకులు, సీఈవో రవి  దేవులపల్లి వివరించారు. డబ్బును సంపాదించాలన్న లక్ష్యంతో పాటు డబ్బుపై గౌరవం, విలువ ఉండాలని ఆయన అన్నారు. అదే విజయానికి సోపానాలను నిర్మిస్తుందని రవి దేవులపల్లి అన్నారు. గత దశాబ్దాలుగా ప్రభుత్వరంగ సంస్థలనుంచి ప్రయివేటు సంస్థలలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, అలాగే స్టార్టప్ కంపెనీలతో పెరుగుతున్న ఉద్యోగఅవకాశాలను వయలెట్ స్ట్రీట్ సహవ్యవస్థాపకులు నయన్ కుమార్ వివరించారు.

స్టార్టప్ కంపెనీలు తప్పక విజయంసాధిస్తాయన్న ఆశాభావాన్ని వెక్ట్రా ఫ్యామిల్టీ ఎండి మను శ్రీనివాసన్ వ్యక్తం చేశారు. ఇంకుబేషన్ సెంటర్ల ఏర్పాటుతోపాటు ప్రభుత్వంనుండి సహాయసహకారాలు అందితే స్టార్టప్ కంపెనీలు అగ్రగామిగా దూసుకెళ్తాయని శ్రీనివాసన్ అన్నారు. చదువుకు, సరదాలకు మధ్య మంచి సమన్వయం సాధించి సమయపాలన చేయగలిగినప్పుడే విజయం వారిని వరిస్తుందని నిపుణులు ఐఎంటి బిజినెస్ స్కూల్ విద్యార్ధులకు సూచించారు.

 

చివరగా, సరైన మానసిక పరిపక్వతో పాటు, తమ ఆలోచనలలో స్పష్టత, నూతనత్వం ఉన్న వ్యక్తులకు విజయ తధ్యమని నిపుణులు పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఎంటి డైరక్టర్ డా.. సతీష్ ఐలవాడి సంధానకర్తగా వ్యవహరించారు. విద్యార్ధుల్లో వ్యాపార వ్యవస్థాపనకు కావాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకొనే శక్తిని కలిగించేందుకు ఓర్టస్  తరహా సదస్సులను నిర్వహిస్తున్నట్టు డా.. సతీష్ ఐలవాడి చెప్పారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)