రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
5 నెలల గరిష్టానికి ద్రవ్యోల్పణం, నష్టాల్లో సెన్సెక్స్
Published on Mon, 06/16/2014 - 13:28
న్యూఢిల్లీ: భారత టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరుకుంది. గత నెలతో పోల్చుకుంటే మే మాసంలో ద్రవ్యోల్పణం 5.20 శాతం ఎగిసింది.
ద్రవ్యోల్పణం పెరుగుదలకు కూరగాయలు, చేపలు, పౌల్ట్రీ లాంటి ఆహార పదార్థాలు, కాఫీ, టీ వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్టస్థాయికి చేరుకుంది.
చమురు, విద్యుత్ ద్రవ్యోల్బణం 10.53 శాతం నుంచి 14.21 శాతానికి పెరిగింది. పెట్రోల్ ధరలు 12.28 శాతం పెరిగాయి. ఆలుగడ్డ ధర 31.44 శాతం పెరగడం కారణంగా ఆహార ద్రవ్యోల్పణం 9.50 శాతం ఎగిసింది. గతంలో అందించిన రిపోర్టుల ఆధారంగా మార్చి ద్రవ్యోల్పణం 5.70 శాతం నుంచి 6 శాతానికి సవరించారు.
ద్రవ్యోల్పణం పెరుగుదల కారణంగా భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 25120 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 7508 వద్ద ముగిసాయి.
#
Tags