ఎయిర్‌ ఇండియాపై కేంద్రం కీలక నిర్ణయం

Published on Thu, 12/12/2019 - 18:39

న్యూఢల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌ ఇండియాకు సంబంధించి 100శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి లోక్‌సభలో గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఎయిర్‌ ఇండియా స్పెసిఫిక్‌ ఆల్టర్నేటివ్ మెకానిజంను (ఏఐఎస్‌ఎఎమ్‌) పునర్నిర్మించామని ఆయన తెలిపారు. ఎయిర్‌ ఇండియాను 100శాతం విక్రయించడాన్ని ఏఐఎస్‌ఎఎమ్‌ స్వాగతించిందని మంత్రి లోక్‌సభలో తెలిపారు.  

విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) రూ.25,000కోట్లు కోరిందని మంత్రి తెలిపారు. 2018-19 సంవత్సరానికి ఎయిర్‌ ఇండియా రూ.8,556.35కోట్లు నష్ట పోయిందని అన్నారు. కాగా, రూ.50వేల కోట్ల అప్పులతో ఎయిర్‌ ఇండియా సతమవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్‌ ఇండియాకు మోయలేనంత రుణభారమే పెద్ద సమస్య అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ