amp pages | Sakshi

త్వరలో తొలి ఆర్‌ఈఐటీ

Published on Mon, 02/25/2019 - 01:11

న్యూఢిల్లీ: దేశంలో తొలి రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌ఈఐటీ/రీట్‌) కార్యరూపం దాల్చనుంది. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బ్లాక్‌ స్టోన్, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూపు సంయుక్తంగా వచ్చే కొన్ని వారాల్లో రీట్‌ ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించనున్నాయి. బ్లాక్‌స్టోన్, ఎంబసీ గ్రూపు జాయింట్‌ వెంచర్‌ అయిన ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ గతేడాది సెప్టెంబర్‌లోనే సెబీ వద్ద రీట్‌ ఇష్యూకు సంబంధించి పత్రాలను దాఖలు చేసింది. 33 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన పోర్ట్‌ఫోలియో ఈ జాయింట్‌ వెంచర్‌కు ఉంది. ఆసియాలో అతిపెద్దది. అద్దెల రూపంలో ఆదాయాన్నిచ్చే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను రీట్‌ కలిగి ఉంటుంది. ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరోక్షంగా రియల్‌ ఎస్టేట్‌ నుంచి ఆదాయాన్ని అందుకోవచ్చు. సెబీ తొలిసారిగా 2014లో రీట్‌ నిబంధనలను విడుదల చేసిన విషయం గమనార్హం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్‌విట్‌)లను కూడా సెబీ అనుమతించగా, ఇప్పటికే ఐఆర్‌బీ ఇన్‌విట్‌ ఫండ్, ఇండ్‌ ఇన్‌ఫ్రావిట్‌ ట్రస్ట్‌లు ప్రజల నుంచి నిధులను సమీకరించి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్‌ అయి ఉన్నాయి.
 
మంచి లాభసాటే! 
కొన్ని వారాల్లో తమ రీట్‌ను విడుదల చేయనున్నట్టు ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ సీఈవో మైక్‌ హోలండ్‌ ధ్రువీకరించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో మాదిరిగా, భారత్‌లోనూ రీట్‌ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రీట్‌లో రాబడులు మొదటి ఏడాదిలో 9 శాతం, ఐదేళ్ల కాలంలో 18 శాతం వరకు ఉంటాయని అంచనా.  బెంగళూరు, పుణె, నోయిడా, ముంబైలోని ఏడు ఆఫీసు కార్యాలయ పార్క్‌లు, భవనాలను ప్రతిపాదిత రీట్‌లో చేర్చనుంది. మొత్తం 33 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణం దీని పరిధిలో ఉంటుంది. 24 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం పరిధిలో ఇప్పటికే రూ.2,000 కోట్ల ఆదాయం వార్షికంగా వస్తోంది. 3 మిలియన్‌ చదరపు అడుగుల పరిధిలో నిర్మాణం జరుగుతుండగా, మరో 6 మిలియన్ల చదరపు అడుగుల మేర నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. 50 శాతానికి పైగా అద్దె ఆదాయం ఫార్చ్యూన్‌ 500 కంపెనీల నుంచే వస్తోంది. రానున్న మూడేళ్లలో అద్దెల ఆదాయం 55 శాతం వరకు పెరుగుతుందని అంచనా. 

Videos

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)