ధరలు తగ్గించిన బాష్‌

Published on Thu, 08/02/2018 - 18:17

సాక్షి, న్యూఢిల్లీ: ఐరోపా దిగ్గజ గృహోపకరణాల సంస్థ 'బాష్'  వినియోగదారులకు  తీపి కబురు చెప్పింది.  ఇటీవల  ప్రభుత్వం సవరించిన జీఎస్‌టీ రేట్ల ప్రకారం వివిధ గృహోపకరణాల రేట్లను కూడా సవరించినట్టు ప్రకటించింది.  రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సర్ గ్రైండర్ల ధరలను 7-8 శాతం తగ్గించినట్టు వెల్లడించింది. తక్షణమే ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

ప్రభుత్వం   ప్రకటించిన పన్ను కోత ప్రయోజనాలను వినియోగదాలరులకే అందించాలనేదే తమ లక్ష్యమని  బాష్‌ ఎండీ, సీఈవో గుంజాన్‌ శ్రీవాస్తవ తెలిపారు. రానున్న పండుగ సీజన్‌  సందర్భంగా  తమ బ్రాండ్లు బాష్‌, సిమెన్స్ గృహోపకరణాలపై అందిస్తున్న తగ్గింపు ధరలు  తమ  ఉత్పత్తులకు మరింత డిమాండ్‌నుపెంచనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2018 ఆర్థిక సంవత్సరంలో 30-35శాతం వృద్ధిని సాధించిందనీ, ఈ ఏడాది కూడా అదే వృద్ధిని సాధిస్తామనే విశ్వాసాన్ని  ప్రకటించారు. కాగా భారత ప్రభుత్వం  15 రకాల  వస్తువలపై జీఎస్‌టీ పన్ను శాతాన్ని 28నుంచి 18కి తగ్గించింది. ఈ  నేపథ్యంలో  శాంసంగ్‌, పానాసోనిక్, గోద్రెజ్ లాంటి ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థలు ఇప్పటికే గృహోపకరణాల ధరల తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ