amp pages | Sakshi

ఈ 3 దిగ్గజ కంపెనీలకూ క్యూ4 షాక్‌

Published on Mon, 06/29/2020 - 15:22

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో ఇన్వెస్టర్లు ఈ మూడు కంపెనీల కౌంటర్లలో అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. జాబితాలో ఆటో విడిభాగాల దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌, పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా, రియల్టీ కంపెనీ శోభా లిమిటెడ్‌ ఉన్నాయి. వెరసి ఈ కౌంటర్లు 11-5 శాతం మధ్య పతనమయ్యాయి.  వివరాలు చూద్దాం..

భారత్‌ ఫోర్జ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో భారత్‌ ఫోర్జ్‌ రూ. 68.6 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 324 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం క్షీణించి రూ. 1742 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ ఫోర్జ్‌ షేరు 11 శాతం కుప్పకూలి రూ. 314 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 309 వరకూ జారింది.

కోల్‌ ఇండియా
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కోల్‌ ఇండియా నికర లాభం 23 శాతం క్షీణించి రూ. 4638 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 25,597 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కోల్‌ ఇండియా షేరు 5.5 శాతం పతనమై రూ. 135 వద్ద ట్రేడవుతోంది. 

శోభా లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో శోభా లిమిటెడ్‌ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 51 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1422 కోట్ల నుంచి రూ. 928 కోట్లకు వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో శోభా లిమిటెడ్‌ షేరు 5 శాతం పతనమై రూ. 216 వద్ద ట్రేడవుతోంది. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)