amp pages | Sakshi

జగనన్నతోనే మళ్లీ మన్యానికి మహర్దశ

Published on Tue, 08/28/2018 - 07:45

సాక్షి, విశాఖపట్నం ,కొయ్యూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మన్య ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందనీ.. జగనన్న సీఎం అయితేనే మళ్లీ ఆ స్వర్ణయుగం వస్తుందని ఇటీవల వైఎస్సార్‌ సీపీలో చేరిన దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టేడి దేముడు కుమార్తె మాధవి అన్నారు. గిరిజనులకు భూమి పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పాడేరు, అరకు నియోజకవర్గాల్లో తిరిగి వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందన్నారు. ఆమె సోమవారం సాక్షితో మాట్లాడుతూ.. మాట తప్పని వంశం నుంచి వచ్చిన వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎట్టి పరిస్థితిల్లోనూ మాటకు కట్టుబడి ఉంటారని, బాక్సైట్‌ తవ్వకాలపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ అమలులోకి తీసుకువచ్చిన బాక్సైట్‌ తవ్వకాల జీవో 97పై ఏ పార్టీ నాయకులూ స్పందించడం లేదు.. కావాలనే వైఎస్సార్‌ సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి బాౖMð్సట్‌ తవ్వకాల గురించి చెప్పామని, ఆయన దానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు.

దీన స్థితిలో విద్య వైద్యం
మన్యంలో మాతాశిశు మరణాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఆపడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని మాధవి విమర్శించారు.
మన్యంలో పాడేరు,అరకులో పేరుకు రెండు పెద్దాసుపత్రులున్నా అక్కడ వైద్యులు లేని పరిస్థితి ఉందన్నారు. 36 పీహెచ్‌సీలకు ఎనిమిది మంది వైద్యులే రెగ్యులర్‌గా ఉన్నారన్నారు. మారుమూల ప్రాంతాల్లో సరైన తాగునీరు లేక బురుదనీటిని తాగి అనారోగ్యంతో మరణిస్తున్నారని తెలిపారు. రోడ్లు లేక ప్రసవాలకు కూడా అవస్థలు పడుతున్నారన్నారు. మన్యంలో ఉపాధ్యాయులు లేక ఎన్నో పాఠశాలలు మూతబడుతున్నాయన్నారు. తక్కువ మంది పిల్లలు ఉన్నారని పాఠశాలలను మూసి వేస్తున్నారని ఆరోపించారు. దీని మూలంగా పిల్లలకు విద్య అందనంత దూరంలో ఉంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలన్ని పరిష్కారం అవుతాయన్నారు. గిరిజనులు నాన్నపై ఎలాంటి నమ్మకాన్ని పెట్టుకున్నారో తనపై కూడా అలాంటి నమ్మకాన్ని పెట్టుకుని దీవించాలని కోరారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)