amp pages | Sakshi

వైఎస్‌ హయాంలో స్కీంలు – బాబు హయాంలో స్కాములు

Published on Tue, 10/23/2018 - 08:07

విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్ర ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం ద్వారా తమ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరించేందుకు వీలుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రజల మద్దతుతో దిగ్విజయంగా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సాలూరులో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. సభా ప్రాంగణంలో ఎటు చూసినా జనం లెక్కకు మించి హాజరయ్యారు.  జనంతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు జగన్‌ సభకు హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నాయకులు ఆశించిన దాని కంటే వారి అంచనాలకు అందనంత స్థాయిలో ప్రజలు హాజరై తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. రానున్న ఎన్నికల్లో విజయం తథ్యమన్న రీతిలో జగన్‌ ప్రసంగానికి ప్రజలు జేజేలు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం, అరాచకాలపై జగన్‌ మాట్లాడిన సమయంలో జనం ప్రతి మాటకు స్పందిస్తూ తమ మద్దతు పలికారు. ఈ సభలో జిల్లా నాయకులు అధికార పార్టీ విధానాలపై విరుచుకుపడ్డారు. జిల్లా నేతల ప్రసంగాలు వారి మాటల్లోనే....

వైఎస్‌ హయాంలో స్కీంలు – బాబు హయాంలో స్కాములు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు (స్కీములు) అమలై లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారు. ప్రస్తుతం చంద్రబాబు హయాంలో అంతే సంఖ్యలో స్కాములు జరుగుతున్నాయి. ఇసుకలో స్కాం, నీరు–చెట్టులో స్కాం, ఉద్యోగాల్లో స్కాం, అమరావతి భూ సేకరణలో స్కాం, ఇలా అన్ని పథకాలు, రంగాల్లో స్కాములు నడిపిస్తున్నది సీఎం చంద్రబాబు నాయుడు. జ్వరాలతో అల్లాడుతున్న గిరిజన విద్యార్థులకు నేలపై కూర్చొండబెట్టి సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టినట్టు సెలైన్‌ బాటిళ్లు ఎక్కించడం ముఖ్యమంత్రి సీనియారిటీని ఆదర్శంగా తీసుకున్నట్టుందిక్కడి వైద్యుల తీరు. విలువలు, విశ్వసనీయత ఉన్నది వైఎస్‌ కుటుంబ సభ్యులదే! జగన్‌ పాలన మనకు అవసరం.–పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే, కురుపాం

ప్రజలను వంచించేందుకే చంద్రబాబు హామీలు
చంద్రబాబు గత  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కేవలం ప్రజలను మోసం చేయడానికేనన్న విషయం ప్రజలు గుర్తించారు. కాలినడకన దుమ్ము, ధూళి, ఎండ, వాన లెక్క చేయకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలనూ కలియతిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే! ప్రత్యేక హోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయించి ప్రధాని మోదీని సైతం ఎదిరించిన నాయకుడు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి. ఆంధ్రులు సాధించాల్సిన ప్రత్యేక హోదా ను ఆడ్డుకున్నది చంద్రబాబు నాయుడే! జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికే ప్రత్యేక హోదా వచ్చేది. మన బతుకులు బాగుపడేవి. మనం జగనన్నను నమ్ముకుంటే మనకు సంక్షేమంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు అందరం కంకణం కట్టుకుందాం.
–శతృచర్ల పరీక్షిత్‌ రాజు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

లంచాలు ఇస్తే కానీ...
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో లంచం ఇస్తే కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనులూ జరుగడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ కార్యక్రమంలోనూ అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయి. సాలూరుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. రాష్ట్ర  ముఖ్యమంత్రి జిల్లాలో పలుమార్లు పర్యటించి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు. జన్మభూమి కమిటీలతో పెన్షన్లు, రేషన్‌ కార్డులు పేదలకు కాకుండా ధనికులకు ఇస్తున్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజల కోసం చేస్తున్న పాదయాత్ర అనన్య సామాన్యం. ఆయనను ముఖ్యమంత్రి చేయడం మనందరి బాధ్యత. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ విజయదుంధుభి మోగించాలి.–పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు

సీఎంను చేసి అభిమానాన్ని నిరూపిద్దాం...
వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నా... ఆ కుటుంబమన్నా.. రాష్ట్ర ప్రజలకు ఎంతో అభిమానం. మరెంతో ప్రాణం. అటువంటి అభిమానాన్ని ఆయనను సీఎంగా చేసి నిరూపించుకుందాం. అందరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఇది సుసాధ్యం. అందరి నోటా వస్తున్న మాటను నిజం చేసుకుందాం. మన సంక్షేమ రాజ్యాన్ని మనమే స్థాపించుకుందాం.
–మాధవి, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటునియోజకవర్గ సమన్వయకర్త

క్రైస్తవ మైనార్టీలను ఆదుకోవాలి...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే క్రైస్తవ మైనారిటీలను ఆదుకోవాలని కోరాం. క్రైస్తవ మైనార్టీలకు శ్మశాన వాటికల కోసం ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని విన్నవించాం. చర్చిలకు తాగునీటి సదుపాయం కోసం బోర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి బడ్జెట్‌ సమావేశంలో క్రైస్తవ మైనార్టీలకు కొంత నిధిని కేటాయించాలని కోరాం.
–పాస్టర్‌ బెహరా ఉదయచంద్ర, క్రిస్టియన్‌ మైనార్టీ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)