వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబు పాలనలో అంతా అవినీతే!
Published on Sat, 08/11/2018 - 16:43
సాక్షి, చీపురుపల్లి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అంతా అవినీతేనని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే తప్ప అభివృద్ధి శూన్యం మని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు నాలుగేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.
మహారాజుకు పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడ గుర్తుంటారని అన్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ అశుభం నెలకొంటుందని అన్నారు. టీడీపీ నాయకుల అవినీతి ఎండగట్టి ప్రజలను చైతన్య పరిచేలా బూత్ కమిటీలు పనిచేయాలని వైఎస్సార్సీపీ నాయకులకు సూచించారు.
#
Tags