చోడవరంలో నేడు జగన్‌ బహిరంగ సభ

Published on Sat, 09/01/2018 - 08:07

సాక్షి, విశాఖపట్నం: ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 251వ రోజు శనివారం కూడా అనకాపల్లి నియోజకవర్గం నుంచి చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రోగ్రామ్స్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురాం వెల్లడించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చోడవరం టౌన్‌ కొత్తూరు జంక్షన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారన్నారు.

అనకాపల్లి నియోజకవర్గం వూడేరు క్రాస్‌ శివారులో  బస చేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర  మామిడిపాలెం మీదుగా గంధవరం వద్ద చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. అక్కడ నుండి దుడ్డుపాలెం జంక్షన్, ముద్దుర్తి జంక్షన్, వెంకన్నపాలెం, అంభేరు పురం, గోవాడ గజపతి నగరం మీదుగా చోడవరం పెట్రోల్‌ బంకు వద్ద టౌన్‌లోకి అడుగుపెడుతుందన్నారు. టౌన్‌ నుంచి నేరుగా కొత్తూరు జంక్షన్‌కు చేరుకుని అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రజలనుద్దేశించి జననేత ప్రసంగించనున్నారని తెలిపారు. అనంతరం మెయిన్‌రోడ్డు, ఆంధ్రాబ్యాంకు రోడ్డు, చినబజారు మీదుగా అన్నవరం జంక్షన్‌ వద్ద రాత్రికి బçసకు చేరుకుంటారన్నారు. చోడవరం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న పాదయాత్ర, కొత్తూరు జంక్షన్‌లో జరిగే బహిరంగసభలో వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రఘురాం కోరారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ