amp pages | Sakshi

జోరువానలోనూ జననేత కోసం..

Published on Fri, 09/21/2018 - 06:53

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రను గురువారం రద్దు చేశారు. బస చేసిన పప్పలపానివాలెం వద్ద అయితే బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అయినా లెక్కచేయకుండా గురువారం ఉదయం పప్పలవానిపాలెంతో పాటు పరిసర కోలవానిపాలెం, ఎస్టీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున శిబిరం వద్దకు చేరుకున్నారు.

జగన్‌ను చూసేందుకు, ఆయన అడుగులో అడుగులేసేందుకు వర్షంలో తడుస్తూనే వేచి ఉన్నారు. ఎప్పటిలాగే గురువారం కూడా షెడ్యూల్‌ సమయానికి పాదయాత్ర ప్రారంభించేందుకు పార్టీ నేతలు కూడా ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర ప్రారంభించాలని జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఎదురు చూశారు. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్న భావనతో పార్టీ నేతలతో చర్చించి పాదయాత్ర రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అదే విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం ప్రకటించారు. మరోవైపు జననేతను చూడకుండా వెళ్లకూడదన్న పట్టుదలతో జోరువానలో తడుస్తూనే జనం శిబిరం వద్ద నిరీక్షించడంతో వారిని నిరుత్సాహపరచ కూడదన్న ఉద్దేశంతో వైఎస్‌జగన్‌ శిబిరం నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. దాంతో ఆయనకోసం నిరీక్షిస్తున్న వారందరూ కేరింతలు కొడుతూ జై జగన్‌.. అంటూ నినాదాలతో హోరెత్తించారు.

పలువురు పార్టీలో చేరిక
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు శిబిరం వద్ద వైఎస్‌జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయనగరం రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరుకు పార్లమెంటు సమన్వయకర్త పరీక్షిత్‌ రాజు, పార్వతీపురం సమన్వయకర్త అలజంగి జోగారావులు వెంటరాగా బీసీ నాయకులు కాపారపు శివన్నాయుడు, కాపారపు సత్యనారాయణ, స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు యండవ నిర్మలాకుమారి తమ అనుచరులతో జననేత సమక్షంలో పార్టీలో చేరారు.

మొహర్రం కారణంగా నేడు విరామం
ముస్లింల పండుగ మొహర్రం సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించినట్టు తలశిల రఘురాం వెల్లడించారు. ఈ నెల 22(శనివారం) నుంచి యథావిధిగా పప్పలవానిపాలెం శివారులోని రాత్రి బస నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Videos

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?