amp pages | Sakshi

'అన్ని వర్గాల వారికి అండగా ఉంటా'

Published on Mon, 12/18/2017 - 16:13

సాక్షి, అనంతపురం: 'చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారు. ఇపుడు ఉన్నత చదువులు చదవాలంటే రూ. లక్షల్లో ఫీజులున్నాయి. చంద్రబాబు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ. 35 వేలకే పరిమితం చేశారు. మీ అందరి ఆశీస్సులతో మనం అధికారంలోకి వచ్చాక పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాను. పెద్ద పెద్ద కోర్సులు చదివే విద్యార్థులకు ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాను. అదేవిధంగా మీ పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమ చేస్తాను. పెన్షన్‌ను రూ.1000  నుంచి రూ. 2 వేలకు పెంచేలా చర్యలు తీసుకుంటాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు పింఛన్‌ వయో పరిమితిని 45 ఏళ్లకు తగ్గిస్తాను. మరో వైపు జీవితాలని చిదిమేస్తున్న మద్యం రాకాసిని దశల వారీగా పూర్తిగా నిషేధిస్తాన'ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం 38వ రోజు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నేలకొండ తండా ప్రజలతో జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు తమ కష్టాలను జననేతకు చెప్పుకున్నారు. వారి బాధలు ఓపికగా విన్న అనంతరం జగన్‌ మాట్లాడుతూ.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారుస్తామన్నారు. అన్ని వర్గాల వారికి అండగా నిలబడతామని భరోసానిచ్చారు. 

కాగా అంతకుముందు బిల్వంపల్లి గ్రామంలో వైఎస్‌ జగన్‌ను గాండ్ల, తెలికల కులస్థులు కలిశారు. గాండ్ల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. యాత్రలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తున్నారు. దారి పొడువునా పంట పొలాల్లోకి వెళ్లి కూలీలు, రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ఉద్యోగుల ఇబ్బందులు తొల‌గిస్తాన‌ని హామీ ఇస్తున్నారు. దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని.. అధికారంలోకి రాగానే అన్నివర్గాల వారికి న్యాయం జరిగేలా చేస్తానని రాజన్న తనయుడు  మాట ఇస్తున్నారు.

Videos

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌