amp pages | Sakshi

గిరిజన రైతులకూ పంట రుణాలు!

Published on Mon, 07/15/2019 - 03:53

సాక్షి, అమరావతి: అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని పునరుజ్జీవింపచేసి.. వాస్తవ ప్రయోజనాలను గిరిజన రైతులకు చేరువ చేసేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు భూమిపై టైటిల్‌ పొందిన గిరిజన రైతులకు ఇతర రైతులతో సమానంగా అన్ని ప్రయోజనాలు, ప్రభుత్వపరమైన లబ్ధి చేకూరేలా గిరిజన సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసింది. దీనివల్ల అటవీ హక్కుల చట్టం ప్రకారం టైటిల్‌ పొందిన రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు మైదాన ప్రాంతాల్లోని రైతులతో సమానంగా పూర్తి హక్కులు పొందగలిగేలా వ్యవస్థ రూపుదిద్దుకోనుంది.

అపహాస్యం పాలైన అటవీ హక్కుల చట్టం
అటవీ హక్కుల గుర్తింపు చట్టం స్ఫూర్తిని, మౌలిక ఉద్దేశాన్ని గత ప్రభుత్వాలు కాలరాసిన ఫలితంగా ఎస్టీ, ఇతర సంప్రదాయక అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 (నెం.2/2007) అపహాస్యమైంది. అడవిలో నివసించే ప్రజల హక్కులను గుర్తించాలనే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006లో ఆమోదం పొందింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని అన్ని అటవీ ప్రాంతాలకు వర్తింపచేశారు. గిరిజనులను గుర్తించి వారికి భూమిపై టైటిల్‌ హక్కును ఇచ్చారు. అయితే, వారికి భూమి ఉన్నా దానిపై రుణం రావటం లేదు. ఏ ప్రభుత్వ పథకం కింద గిరిజన రైతులకు లబ్ధి చేకూరటం లేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాదాపు 96 వేల మంది గిరిజనులు భూమి పొందినా, వారిలో ఐదు శాతం మందికి  కూడా సగటు రైతులకు లభించే హక్కులను పొందలేకపోతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు భూమిపై అన్ని హక్కులు కల్పిస్తూ దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అటవీ హక్కుల చట్టం అమలుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫలితంగా పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు మైదాన ప్రాంత రైతులతో సమానంగా హక్కులు, ప్రభుత్వ పథకాలు లభిస్తాయి. ఇకపై బ్యాంకులు సైతం గిరిజనులకు పంట రుణాలు అందిస్తాయి. 
 

Videos

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్

ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

టీడీపీ నాయకుల దాష్టీకం..

జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు

కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం

వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...

గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!

ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌..

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

Photos

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)