amp pages | Sakshi

సంకల్ప స్మృతులు

Published on Tue, 01/08/2019 - 12:20

జనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యా తెలుసుకోవాలనుంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండెచప్పుడు వినాలనుంది. అందుకే ప్రతి గడపకూ వస్తున్నా.– ప్రజాసంకల్పయాత్ర మొదలు పెట్టిన రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలు

ఇది అక్షర సత్యమైంది. చరిత్రలో లిఖితమైంది. ప్రజా సంకల్ప యజ్ఞం జిల్లాలోని ప్రతి గడపనూ తాకింది. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఓదార్పునిచ్చింది. దీనులకు అభయాన్ని అందించింది. యువతలో ఉత్తేజాన్ని నింపింది. రాజకీయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ‘అన్నొస్తున్నాడ’నే భరోసానిచ్చింది. నేటికీ ఆ గురుతులు పదిలం. జనం దాచుకున్న జ్ఞాపకాలే దీనికి సాక్ష్యం.

చిత్తూరు, నగరి : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించే రోజునే నగరి మండలం ముడిపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్‌ ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాడు. యాత్ర ముగిశాక శ్రీవారికి తలనీలా లు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. ఇప్పటివరకు అదే సంకల్పంతో జగన్‌ వెంట నడుస్తూ వస్తున్నాడు. యాత్ర ప్రారంభంలో ఇడుపులపా య నుంచి ఎర్రగుంట్ల నియోజకవర్గం పోట్లదుర్తి వరకు 6 రోజులు,  మైదుకూరు నుంచి ఆళ్లగడ్డ వరకు 4రోజులు, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 4రోజులు, చిత్తూ రు జిల్లా దామలచెరువు నుంచి శ్రీకా ళహస్తి వరకు, నెల్లూరు జిల్లా వెంక టగిరి నియోజకవర్గంలో 3 రోజులు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 3 రోజులు, విజయవాడ వంతెనపై నుంచి విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, మైలవరం, నూజి వీ డు, గన్నవరం, పెనమలూరు, పామ ర్రు, మచిలీపట్నం, పెడన, గుడివాడ ప్రాంతాల్లో 20 రోజులు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గోపాలప ట్నం, ఉంగుటూరు, దెందులూరు, పాలకొల్లు, కొవ్వూరులో 8 రోజులు, తూర్పుగోదావరి జిల్లాలో రాజమం డ్రి వంతెన నుంచి రాజోలు, అమలాపురం ప్రాంతాల్లో పది రోజులు, విజయనగరం జిల్లాలో 3వేల కిలో మీటర్ల సంబరంలోనూ పాల్గొన్నా డు. ఈ సందర్భంగా ప్రకాష్‌ మాట్లా డుతూ ‘గతేడాది జనవరి 9న పెనుమూరు సమీపంలో స్థానిక చెరకు రైతుల సాధకబాధకాల గురించి జగనన్నకు తెలియపరిచా. అప్పుడు ఆయన నేను ఇచ్చిన చెరకు రసం తాగారు. ఆ అనుభూతి నేను మరువలేను. ఈనెల 10న తిరుపతి నుంచి పాదయాత్రగా వెళ్లి శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటా’ అని తెలిపాడు.

అవన్నీ మరిచిపోయా..!
పలమనేరు:‘నేను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానిని. ఆయనను నా గుండె గుడిలో గూడుకుట్టుకున్నాను. అలాంటి మహానుభావుడి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నాడని తెలిసి ఉప్పొంగిపోయా. ఆయనతో కలిసి నడవాలని తాపాత్రయపడ్డా. ఇడుపులపాయకెళ్లి అక్కడ జరిగిన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ జిల్లా మొత్తం పూర్తయ్యేవరకు పాదయాత్రలోనే ఉన్నా. అప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. చెరువులు, బావుల వద్ద స్నానం చేశా. భోజనం కూడా చేయని రోజులున్నాయి. తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కొంత దూరం నడిచా. చాలా సంతోషం అనిపించింది. ఆ బాధలన్నీ మరిచిపోయా’నని పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం పట్రపల్లెకు చెందిన వాసు గుర్తు చేసుకున్నారు. త్వరలో ప్రజాసంకల్పయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఆయన తన మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు.        – వాసు, వి.కోట

అన్నొచ్చాడు
చిత్తూరు అర్బన్‌:‘మాది పూతలపట్టు. 2014 ఎన్నికల్లో రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కానీ మాకు ఒక్క రూపాయీ మాఫీ కాలేదు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టొద్దని చెప్పడంతో మానేశాం. రూ.9 వేలు అసలుకు మూడేళ్లలో వడ్డీ కలిపి రూ.20 వేలు అయింది. ప్రభుత్వం ఎలాంటి నగదు మా ఖాతాల్లో వేయలేదు. తీసుకున్న అప్పును వడ్డీతో కలిపి కట్టాల్సిందేనని బ్యాంక్‌ అధికారులు చెప్పారు.  మాకు జరిగిన అన్యాయాన్ని, నాయకులు చేసిన మోసాన్ని అన్న (వైఎస్‌.జగన్‌)కు చెప్పాం. నేనున్నాను.. మీకేం కాదు.. మంచి రోజులు వస్తాయి.. మీ సమస్యలను తీరుస్తానని అన్న మాటిచ్చారు.    – భాగ్యలక్ష్మి, పూతలపట్టు

ఉపాధి కల్పిస్తానన్నారు..
‘నేను గత ఏడాది బీ.టెక్‌ పూర్తిచేశా. పూ తలపట్టు వద్ద పాదయాత్రలో జగనన్నను కలిశా. ఆయన సొంత చెల్లెలుగా చూశారు. చిత్తూరు జిల్లా కేంద్రం లో  ఎలాంటి ఉపాధి, విద్యాకేంద్రాలు లేవు.. ఉన్నత చదువుల కోసం బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తోందని చెప్పా. సమస్యలన్నీ  జగనన్న ఓపిగ్గా విన్నారు. మన ప్రభుత్వం ఏర్పాటయ్యాక యువతకు చిత్తూరులో మంచి ఉపాధి అవకాశాలు కల్పించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆయన మాటపై మాకు నమ్మకం ఉంది.                   – గౌతమి, కట్టమంచి, చిత్తూరు

భవితకు బంగారు మాట
కలికిరి:‘అప్పుడు కలికిరి మండల పరిధిలో ప్రజాసంకల్పయాత్ర జరుగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్‌ని కలవాలని మా కుటుంబం అంతా ఎదురుచూసింది. చాలా కష్టమనిపించింది. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కొన్ని రోజుల తర్వాత జగన్‌సార్‌ని కలిశాం. ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఏమి చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు ? ఎలా చదువుతున్నావు..? అని అడిగారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు సాగించడం కష్టమవుతోందని చెప్పా. సార్‌.. వెంటనే స్పందించారు. తమ ప్రభుత్వం వస్తే ఉన్నత చదువులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ధైర్యం చెప్పారు. ఆ మధుర జ్ఞాపకాన్ని నా జీవితంలో మరువలేను.’  – సాయిచరణ్‌రెడ్డి, విద్యార్థి, కలికిరి

అన్న అంకితభావానికి ఫిదా!
తిరుపతి రూరల్‌: మాది తిరుపతి రూరల్‌ మండలం పద్మావతీపురం. పార్టీలకు అతీతంగా ప్రజలు అశీర్వదించడంతో పంచాయతీ సర్పంచ్‌గా గెలిచా. నాపై నమ్మకంతో మండల సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా రామచంద్రాపురం మండలం నెమ్మళ్లగుంటపల్లికి వెళ్లా. అక్కడ సదస్సులో మాట్లాడే అవకాశమొచ్చింది. పంచాయతీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష, నిధులు అందించకుండా వేధిస్తున్న తీరు, చేపట్టాల్సిన చర్యలపై ఆయనకు వివరించాను. ప్రతి సమస్యను సానుకూలంగా ఆలకించడమే కాకుండా ముందు చూపుతో వాటిని పరిష్కరించేందుకు తాను చేపట్టే చర్యలను ఆయన చెప్పిన విధానం ఎంతో నచ్చింది. ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న విజన్‌ ఎంతో ఆకట్టుకుంది. ఆయన అంకితభావానికి ఫిదా అయ్యాను. ఆయనతో నడిచాను.  ప్రాణం ఉన్నంత వరకు ఆయన పార్టీలో కొనసాగుతా. పాదయాత్ర తర్వాత పూర్తిస్థాయి జగనన్న సైనికుడిగా మారా. – వి.గణపతినాయుడు, పద్మావతిపురం

నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం
మదనపల్లె: సీపీఎస్‌ రద్దు కోసం గళమెత్తినా ధైర్యం చెప్పేవారు లేరు. ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. అందుకే జగనన్నను కలిశాం. అక్కడ ఆయన్ను చూస్తే ఆశ్చర్యమేసింది. ఏ నమ్మకంతో ఒక వ్యక్తి వెనుక ఇంతమంది ప్రజలు, అభిమానులు వెంట పడుతున్నారనుకున్నా. ఆయన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే సీపీఎస్‌ రద్దు చేయాలని ప్లకార్డులు చూపించాం. ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఉద్యోగుల కష్టాలు తీర్చుతామని ధైర్యం చెప్పారు. ప్లకార్డులు చేతబట్టి మాతోపాటు నినాదాలు చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆ మధుర జ్ఞాపకం ఇప్పటికీ నా కళ్లెదుటే కదలాడుతోంది. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించా.        – సరస్వతి, ఉపాధ్యాయురాలు, పీలేరు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)