అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రిజిస్ట్రేషన్ చేయించకపోతే వాహనం సీజ్
Published on Fri, 03/30/2018 - 10:26
అనంతపురం సెంట్రల్: శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించని వాహనాలను త్వరలోనే సీజ్ చేయనున్నట్లు ఉప రవాణా కమిషనర్ సుందర్వద్దీ హెచ్చరించారు. గురువారం ఆయన రవాణాశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని వాహనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24,593 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు సీఎఫ్ఎస్టి సైట్ మూసివేయనున్నామనీ, దీంతో ఆ వాహనాలకు భవిష్యత్లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదన్నారు. అందువల్ల ఇంకా వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించని వారంతా ఏప్రిల్ 5లోపు చేయించాలన్నారు. లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీధర్, వివిధ షోరూంల డీలర్లు పాల్గొన్నారు.
#
Tags