amp pages | Sakshi

ఎన్నికల నాటికి మేమే హీరోలం

Published on Tue, 12/19/2017 - 01:35

సాక్షి, అమరావతి/హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కూడా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఆయన సోమవారం విజయవాడలో, హనుమాన్‌ జంక్షన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ గుజరాత్‌లో వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రంలో గత ఎన్నికల్లో మేం(బీజేపీ), పవన్‌కల్యాణ్, చంద్రబాబు కలిస్తే రెండు శాతం మెజార్టీ మాత్రమే దక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో కమలం రేకులు విచ్చుకుంటోంది. వచ్చే ఎన్నికల నాటికి మేం(బీజేపీ) హీరోలుగా మారతాం. ఏపీలో బీజేపీ బలపడుతుంది’’ అని చెప్పారు. 

ఇతర పార్టీలను డిక్టేట్‌ చేస్తాం...
‘‘రాష్ట్రంలో పరిపాలన చేయకుండా ట్రేడింగ్‌ చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. వాళ్లు(టీడీపీ) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లను జాయిన్‌ చేసుకుంటున్నారు. అవినీతి పరులన్న ముద్రపడిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చేశారు. మమ్మల్ని మాత్రం మీరు అలాగే ఉండండి, ఎన్నికలప్పుడు మూడు సీట్లిస్తే తీసుకోండి, నాశనమైపోండి అని అంటున్నారు. ఇకపై అలా జరిగే ప్రసక్తే లేదు. ఇప్పటివరకు టీడీపీకి మిత్రపక్షంగానే ఉన్నాం, రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో సీట్లు యాచించే స్థితిలో ఉండబోం. ఇతర పార్టీలను డిక్టేట్‌ చేసేలా ఎదుగుతాం’’ వీర్రాజు స్పష్టం చేశారు.   

మిత్ర ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం 
తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, బహిరంగంగా విమర్శించడం ఖాయమని సోము వీర్రాజు తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలనే లక్ష్యంతో ఉందని, ఏపీలోనూ ఆ దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. 1999, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ గుర్తించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు, మిత్ర ధర్మం విస్మరించి బీజేపీపై విమర్శలు చేసినప్పుడు కచ్చితంగా ఎదుర్కొంటామన్నారు. 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌