amp pages | Sakshi

ఏడాదిలో ఒక్కరే మరణించారట

Published on Fri, 04/20/2018 - 08:54

విశాఖ జిల్లాలో ఆరోగ్యం సుభిక్షంగా ఉందని జిల్లా యంత్రాంగం చెబుతోంది. గడచిన ఏడాదిలో మలేరియా, డయేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, ఆంత్రాక్స్, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన 10,902 మంది పడగా వారిలో ఒక్కరంటే ఒక్కరే చనిపోయారని తేల్చింది.

సాక్షి, విశాఖపట్నం : ఏటా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, పచ్చకామెర్లతో పెద్దసంఖ్యలో చనిపోతున్నారు. ఇలా మరణించే వారి సంఖ్య మైదానం, పట్టణ ప్రాంతాలకంటే మన్యంలోనే ఎక్కువగా ఉంటోంది. కానీ జిల్లా మొత్తమ్మీద స్వైన్‌ఫ్లూతో ఒక్కరే చనిపోయారని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అలాగే 2018 జనవరి నుంచి ఇప్పటివరకు 753 మంది వ్యాధులకు గురవ్వగా వీరిలోనూ ఒక్కరే మరణించినట్టు చూపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతోందని, నిర్లక్ష్యం వహించడం లేదని అందరూ భావించాలన్న ఎత్తుగడతోనే మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

వేసవికాలంలో డయేరియా ఉధృతమవుతోంది. వర్షాకాలం ఆరంభానికి ముందే వ్యాధుల (ఎపిడమిక్‌) సీజన్‌ మొదలవుతుంది. అలా అక్టోబరు దాకా ఆ సీజను     ప్రభావం, ప్రతాపం చూపుతుంది. అప్పట్నుంచి దోమల బెడద తీవ్రమవుతుంది. ఎపిడమిక్‌ సీజన్‌లోను, శీతాకాలంలోనూ దోమలు కుట్టడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక జ్వరాలు విజృంభిస్తాయి. వీటి బారిన పడిన వారు సకాలంలో సరైన వైద్యం చేయించుకోకపోతే మృత్యువాత పడుతుంటారు. ఇలా ఏటా ప్రతి మండలంలోనూ వివిధ ప్రమాదకర వ్యాధులతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.

వైద్యం అందుబాటులో ఉండని గిరిజన (ఏజెన్సీ) ప్రాంతాల్లో అయితే మరణాల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. మారుమూల మన్యం గూడేల్లో పిట్టల్లా రాలిపోతుంటారు. ప్రధానంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూలతో ఎక్కువ మంది చనిపోతుంటారు. అయినప్పటికీ ఇవేమీ రికార్డుల్లోకి ఎక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఇళ్ల వద్దో, ఆస్పత్రుల్లోనో చనిపోయిన వారికి వేర్వేరు కారణాలు చూపుతున్నారు. ఫలితంగా నామమాత్రంగా ఒకటి, అరా మరణాలను నమోదు చేస్తున్నారు.  

అంకెల గారడీ
ఇలా అంకెలతో మోసం చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం వ్యాధి తీవ్రత లేదన్న నిర్ధారణకు వస్తుంది. ఫలితంగా అక్కడ శ్రద్ధ చూపడం మానేస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పేదలు అనారోగ్యం బారిన పడడం, కొన్నాళ్లకు తగిన చికిత్స అందక చనిపోవడం జరుగుతోంది. 

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)