amp pages | Sakshi

విజయవాడలో ఎంసెట్ రద్దీ

Published on Sat, 04/30/2016 - 04:44

తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు
ప్రశాంతంగా పరీక్ష
మండుటెండలో విద్యార్థుల అవస్థలు
కిటకిటలాడిన బస్‌స్టేషన్

 
విజయవాడ : ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో విజయవాడలో రద్దీ నెలకొంది. రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడటంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు. ఎంసెంట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల, వారి తల్లిదండ్రులు కార్లు, బైక్‌లు, ఇతర వాహనాల్లో వేలాది తరలిరావడంతో మధ్యాహ్నం, సాయంత్రం రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇంజినీరింగ్ పరీక్ష ముగి శాక ఇంటికి వెళ్లేవారు, మెడిసిన్ పరీక్ష రాసేందుకు వచ్చేవారితో ట్రాఫిక్ రీద్దీ ఏర్పడింది. బందరురోడ్డు, ఐదో నంబరు రోడ్డు, ఏలూరు రోడ్డు ట్రాఫిక్ వల యంలో చిక్కుకున్నాయి. కొన్ని సెంటర్ల వద్ద చివరి క్షణాల్లో విద్యార్థులు పరుగులు తీసి పరీక్షహాళ్లకు చేరుకున్నారు. విజయవాడ రీజన్‌లో 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇంజినీరింగ్ పరీక్షకు 22,405 మంది హాజరవగా, 842 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ పరీక్షకు 18,984 మందికి 18,481 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 96.37 శాతం, మెడిసిన్‌లో 97.35 శాతం మంది   హాజరయ్యార కో-ఆర్డినేటర్ రత్నప్రసాద్ చెప్పారు.


 సకాలంలో హాజరైన విద్యార్థులు
ఎంసెట్ ప్రవేశ పరీక్షకు క్షణం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు మందుగానే ప్రకటించడంతో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 86 పరీక్ష కేంద్రాల పరిధిలో 15 మంది ప్రత్యేక పరిశీలకులు, 48 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, 48 మంది పరిశీలకులు, 1760 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు. పరీక్ష హాళ్లలోకి వాటర్ బాటిళ్లను కూడా అనుమతించకపోవడంతో సిద్ధార్థ, లయోల కళాశాలల వద్ద విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసెట్ పరీక్షకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎండ తీవ్రతతో ఇబ్బందిపడ్డారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని చెట్ల కింద, కాలేజీలు ఏర్పాటుచేసిన షామినాయాల కింద సేదతీరారు.


400 ఉచిత బస్సులు
ఎంసెట్ పరీక్షలకు నగరంలో నడుస్తున్న 400 సిటీ బస్సులలో విద్యార్థులను ఉచితంగా అనుమతించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరో 40 బస్సులు నడిపామని పేర్కొన్నారు. అయితే పరీక్షల సమయంలో ఈ బస్సులు నామమాత్రంగా నడిచాయని విద్యార్థులు ఆరోపించారు. కొందరు కండక్టర్లు తిరుగుప్రయాణంలో టికెట్లు కొట్టి చార్జీలు వసూలు చేశారని తెలిపారు.

బస్టాండు, రైల్వే స్టేసన్ కిటకిట
ఎంసెట్ పరీక్షలు ముగిసి కార్పొరేట్ కాలేజీల విద్యార్థులు స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో సిటీ బస్సులు కిక్కిరిసి ప్రయాణించాయి. బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ రద్దీగా మారాయి. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ వెళ్లే విద్యార్థులు బస్సులు, రైళ్ల కోసం ఎగబడ్డారు.

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌