amp pages | Sakshi

'బోరు'మంటున్నాయి

Published on Mon, 04/30/2018 - 11:35

సరైన వానలు లేక యేటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు, బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం వచ్చిందంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.  కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీరు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతిపంపు నీటితోనైనా గొంతు తడుపుకుందామనుకుంటే అవి మొరాయిస్తున్నాయి. యేటా వీటి మరమ్మతులకు  నిధులు మంజూరువుతున్నాయి. వాటిని అధికారులు  ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఆళ్లగడ్డ:  చేతిపంపుల మరమ్మతుల పేరుతో అధికారులు ధన దాహం తీర్చుకుంటున్నారు. కొంత మంది నాయకులు వీరికి సహకరిస్తున్నారు. జిల్లాలో 54 మండలాల్లో 821 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆత్మకూరు,  మున్సిపాలిటీలు, ఆళ్లగడ్డ, గూడూరు, కోడుమూరు, నందికొట్కూరు నగర పంచాయతీలున్నాయి. వీటన్నింటిలో మొత్తం 25,542 చేతిపంపులున్నాయి. వీటితో పాటు మోటార్ల ద్వార నీరందించే బోర్లు మరో 1000 దాకా ఉన్నాయి. వాస్తవంగా ప్రతి 250 బోర్లకు ఒక మెకానిక్‌ ఉండాలి.   500 బోర్లకు కూడా  ఒక మెకానిక్‌ లేడు. 54 మండలాలలకు కలిపి 14 మందే ఉన్నారు. దీంతో చేతిపంపుల నీటిపైనే ఆధారపడే  ఆళ్లగడ్డ, కోవెంలకుంట్ల, నంద్యాల వంటి  ప్రాంతాల్లో   పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మరమ్మతులకు గురైన చేతిపంపులు  బాగు చేయాలంటే సంవత్సరాలు పడుతోంది. మోకానిక్‌ల కొరత ఒక కారణమైతే వచ్చిన నిధులు కొందరు అధికారులు, అధికారపార్టీ నాయకులు మధ్యలోనే స్వాహా చేయడం మరో కారణంగా కనిపిస్తోంది.

నిధులు కరిగిపోయినా.. మెరుగవ్వని బోర్లు
జిల్లాలో మొత్తం 25 వేల దాక బోర్లుండగా వీటిలో చాలా బోర్లు చిన్నచిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి . అయితే వీటిని ఉపయోగం లోకి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడిని తీర్చాలనే లక్ష్యంతో ఒక్కో బోరుకు ఏడాదికి రూ. 2 వేల ( ఆరు నెలల కోసారి 1000)  చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి  ఒక్కో బోరుకు రూ. 1000 చొప్పున   జనవరి నెలలోనే  ఎంపీడీఓల ఖాతాల్లో  నిధులు జమ అయ్యాయి. జిల్లా మొత్తానికి రూ. 2.5 కోట్లు నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటితో అదనపు పైపులు, బోరు మరమ్మతులు, మెకానిక్‌ (కాంట్రాక్ట్‌)ల కూలీ ఖర్చులకు వెచ్చించాలి. కానీ చాలా చోట్ల బోర్ల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

సొంత అవసరాలకు సామగ్రి  
జిల్లాలోని అనేక మంది అధికార పార్టీకి చెందిన సర్పంచులు చేతిపంపులకు అదనపు పైపులు అవసరమని తీసుకెళ్తున్నారు. తర్వాత వాటిని వేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. కొందరు  పశువుల పాకలకు, రేకుల షెడ్డుకు ఉపయోగించుకుంటున్నారు.  ఈవిషయం అధికారులు తెలిసినా చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)