స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భూగర్భ విద్యుత్ కేబుల్ నుంచి మంటలు
Published on Tue, 08/22/2017 - 13:58
విజయవాడ : విజయవాడ నక్కల రోడ్డులో భూగర్బ విద్యుత్ వైర్లలో ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు రోడ్డు నుంచి నక్కల్ రోడ్డుకు వెళ్లే జంక్షన్లో ఓ విద్యుత్ స్తంభం నుంచి పక్కనే వున్న కమర్షియల్ కాంప్లెక్స్ వరకు భూగర్భ విద్యుత్ లైన్ ఉంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు బయటకు వచ్చాయి.
ఆ సమయంలో రోడ్డుపై నడిచి వెడుతున్న రాజ్యలక్ష్మి అనే మహిళ మంటల బారిన పడి గాయపడింది. వెంటనే స్థానికులు మహిళను కాపాడారు. రోడ్డు మీద విద్యుత్ ప్రసారం జరుగుతోందంటూ అధికారులకు స్థానికులు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. రోడ్డుపై వెళ్లే వారు ఏం జరుగుతున్నదో తెలియక భయభ్రాంతులకు గురయ్యారు.
#
Tags