amp pages | Sakshi

ఇదేమి శి'క్షయా'..!

Published on Wed, 10/10/2018 - 14:18

పశ్చిమగోదావరి, పాలకొల్లు టౌన్‌: జిల్లాలో క్షయ వ్యాధి (టీబీ) చాపకింద నీరులా విస్తరిస్తోంది.  ఆ వ్యాధి మరణాలకు దారి తీస్తోంది. ఏజెన్సీ, మెట్ట, డెల్టా అనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ క్షయ పీడితులు పెరిగిపోతున్నారు. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో క్షయ కేసులు అధికంగా నమోదవుతుండగా, ఏజెన్సీలో తక్కువగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో మరణాల సంఖ్య మాత్రం అధికంగా ఉంటోంది.

జిల్లాలో మూడేళ్లుగా ఏటా 4,500 నుంచి ఐదు వేల కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేటు వైద్యులు చెబుతున్న ప్రకారం ఈ కేసుల సంఖ్య ఏటా మరో మూడింతలు అంటే 20 వేలకు పైమాటేనని తెలుస్తోంది. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి వేళ స్వల్ప స్థాయిలో జ్వరం రావడం, బాగా చెమటలు పట్టడం, నెలల తరబడి దగ్గు ఉండటం వంటి లక్షణాలతో క్షయ బాధితులు కొన్ని సందర్భాల్లో మరణాలపాలవుతున్నారు.

బాధితులు ఎవరంటే..
రోగ నిరోధక శక్తి బలహీనపడినప్పుడు క్షయ వ్యాధి దాడి చేస్తుంది. పొగ తాగేవారు, మద్యం అలవాటు ఉన్న వారు, మధుమేహం, హెచ్‌ఐవీ బాధితులు, గని కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మురికి వాడల్లో నివసించే వారు, గాలి సరిగా ప్రసరించని ప్రాంతాల్లో జీవించే వారికి క్షయ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. సరైన పోషకాహారం , నిద్ర వంటివి లోపించడం వలన రోగ నిరోధక శక్తి సన్నగిల్లే వారికి ఈ ముప్పు పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా క్షయ వ్యాధి ఊపిరితిత్తులకు సోకుతుంటుంది. ఇక్కడితోనే కాకుండా శరీరంలో గోళ్లు, వెంట్రుకలు మినహా ఏ భాగాన్నయినా క్షయ కబళిస్తుంది.

క్షయ వ్యాధి విస్తరణకు..
జిల్లాలో క్షయ కేసుల సంఖ్య పెరగడానికి స్థానిక పరిస్థితులే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణంలో దుమ్మ ధూళి కణాలు పెరిగిపోవడం వలన క్షయ విస్తరిస్తోంది. క్షయ వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వారి నుంచి వచ్చే బ్యాక్టీరియా గాల్లోని దుమ్ము ధూళి కణాలకు అతుక్కుపోయి, ఇతరులు ఆ గాలి పీల్చినపుడు వారి శరీరంలోకి చేరి వ్యాధిబారిన పడుతున్నారు. గతంలో మురికి వాడలు, ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి, ప్రస్తుతం దుమ్మ ధూళి కణాల ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది.

ఏటా 5వేల  కేసులు
జిల్లాలో ఏటా 4,500 నుంచి 5 వేల వరకు క్షయ వ్యాధి కేసులు నమోదవుతున్నాయని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారిణి డా.జి రత్నకుమారి  తెలిపారు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. క్షయ పీడిత జిల్లాల్లో మన రాష్ట్రం 4వ స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు. మురికివాడల్లోని పరిస్థితులే క్షయ వ్యాధికి ప్రధాన కారణం. ఇరుకు ఇళ్లల్లో, ఒకే గదిలో ఎక్కువ మది నివసించడం వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.  ముఖ్యంగా భవన నిర్మాణ పనులు, శ్లాబ్‌లు, సిమెంట్‌ పనులు చేసే వారికి మార్కెట్లలో పని చేసే కార్మికులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తోంది. వ్యాధి నివారణకు జిల్లాలోని అన్ని ఏరియా ప్రభుత్వాసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  వ్యాధి గుర్తించి మందులు వాడితే ప్రాణాంతకం కాదు. క్షయ వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్య శాఖ ఆర్టీపీసీఆర్‌ ఆధునిక యంత్రాలను గత రెండు రోజుల క్రితం 16 ఏరియా ఆసుపత్రిలకు అందిచాం. పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఉచితంగా ప్రభుత్వాసుపత్రిలు, పీహెచ్‌సీల్లో మందులు వాడితే వ్యాధి నయమవుతుంది. 2025నాటికి జిల్లాలో క్షయ వ్యాధి పూర్తిగా నిర్మూలనకు కృషి జరుగుతుంది.- డా.జి.రత్నకుమారి,  జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి

నివారణలో విఫలం
వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి 10 మందిలో నలుగురిలో క్షయ క్రిమి ఉంటుంది. ఒంట్లో క్రిమి ఉన్నంత మాత్రాన వాళ్లంతా  క్షయ బాధితులేం కాదు. శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి  దానిని సమర్థవంతంగా నియంత్రణలో ఉంచుతుంది. దీనిని ‘లేటెంట్‌ టీబీ’ అంటారు. శరీరంలో ఈ క్రిమి ఉన్న 10 శాతం మందిలో మాత్రం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వ్యాధి నిరోధక శక్తి లోపించినప్పుడు  ఈ క్రిమి విజృంభించి క్షయ వ్యాధికి కారణమవుతుంది. ఇలాంటి వారిని తక్షణమే గుర్తించి సమర్థంగా చికిత్స చేస్తే ఈ క్రిమి వ్యాప్తి, విజృంభణ, ఉద్ధృతి తగ్గుతాయి. కానీ.. ఈ విషయంలో యంత్రాంగం పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతోంది. వ్యాధి బారిన పడిన వారు ప్రభుత్వాసుపత్రులకు వెళితే తప్ప ఈ కేసులు నమోదవటం లేదు. ప్రైవేటు వైద్యులు క్షయ అనుమానిత కేసులను నేరుగా ప్రభుత్వాసుపత్రికి పంపిస్తే తప్ప ఈ కేసులు ఉన్నట్టు గుర్తించలేని పరిస్థితి. గ్రామాలు, వార్డుల స్థాయిలో సర్వే నిర్వహించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)