amp pages | Sakshi

మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దు

Published on Tue, 10/21/2014 - 03:05

మహానంది: మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దని రైతులకు కర్నూలుకు చెందిన డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.సరళమ్మ, నంద్యాల ఏడీఏ చెన్నయ్య సూచించారు. వరిలో తెగుళ్లను పరిశీలించేందుకు వారు సోమవారం మహానంది మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. వరిలో ప్రస్తుతం అగ్గి, ఆకుముడత తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఆకులపై నూలు కండె ఆకారపులో గోధుమ రంగులో మచ్చలు వస్తాయన్నారు.

కనుపులు నల్లగా మారుతాయని చెప్పారు. వీటిలో మూడు దశలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి తెగుళ్లను మెడవిరుపు తెగుళ్లు అనుకుని మందులు చల్లుతారని, ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. అగ్గి తెగులు కనిపిస్తే బావిస్టిన్ మందును లీటరు నీటికి ఒక గ్రాము, సిక్సర్ మందును లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున వాడాలన్నారు. ప్రస్తుతం రైతులు ఎక్కువగా 20-20-13 వేస్తున్నారని, కాని 20-20-0 మందును వాడాలని సూచించారు.

వరి దుబ్బుల వద్ద మచ్చలు బూడిద రంగులో కనిపిస్తున్నాయని.. నివారణకు ఎక్సాకొనజోల్ 2 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటికి కల్పి వాడాలన్నారు.  పొలంలో నీళ్లు లేకుండా పైరు అడుగుభాగం తగిలేలా స్ప్రే చేయాలన్నారు. ప్రస్తుతం సల్ఫైడ్ విష ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని.. అలాంటప్పుడు పొలాన్ని ఆరబెట్టాలని తెలిపారు. సల్ఫర్ ఉన్న ఎరువులు అసలు వాడరాదనిసూచించారు.  దీని ద్వారా విష ప్రభావం అధికంగా వస్తూ వేర్లు నల్లగా మారిపోతాయన్నారు. ఆకులపై కూడా మచ్చలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. యూరియా, పొటాష్ ఎరువులు వాడవచ్చన్నారు.

పొటాష్ వాడటం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. చిరుపొట్ట దశలో ఎకరా పైరుకు ఒక బస్తా పొటాష్ వేయాలని సూచించారు. వారి వెంట ఆర్‌ఏఆర్‌ఎస్ కీటక విభాగపు శాస్త్రవేత్త ఎన్,కామాక్షి, మహానంది ఏఓ కల్యాణ్‌కుమార్, ఏఈఓ బాల లింగమయ్య ఉన్నారు.

Videos

ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

టీడీపీ నాయకుల దాష్టీకం..

జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు

కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం

వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...

గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!

ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌..

ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..

మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)