amp pages | Sakshi

రిజిస్ట్రేషన్ల బాదుడు

Published on Mon, 07/31/2017 - 01:43

రేపటి నుంచి పెరగనున్న ఛార్జీలు
ఆస్తుల కొనుగోలుదారులపై రూ.15 కోట్ల భారం

కడప కోటిరెడ్డి సర్కిల్‌ :
ఆస్తుల క్రయ విక్రయాల ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఫీజు అమలుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అబ్కారీ తర్వాత రిజిస్ట్రేషన్‌శాఖ కీలక ఆదాయ వనరుగా మారింది. ఇటీవల ప్రభుత్వం ఆస్తుల విలువను పెంచడంలో భాగంగా చర్యలు చేపట్టి భూములు, భవనాలు, అపార్టుమెంట్లు, వాణిజ్య కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో  10 నుంచి 25 శాతం వరకు ఆస్తి విలువలను పెంచింది.

దీంతో జిల్లా కొనుగోలు దారులపై దాదాపు రూ. 15–20 కోట్ల భారం పడనుంది. రిజిస్ట్రేషన్‌ శాఖపరంగా జిల్లాను రెండు డివిజన్లుగా విభజించారు. అందులో కడప డివిజన్‌ పరిధిలో తొమ్మిది కార్యాలయాలు (కడప అర్బన్, రూరల్, సిద్దవటం, రాజంపేట, పుల్లంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చిట్వేలి, సుండుపల్లె) ఉన్నాయి. ఈ కార్యాలయాల ద్వారా రూ. 10–13 కోట్ల ఆదాయం ఒనగూరనుంది. ప్రొద్దుటూరు డివిజన్‌లో తొమ్మిది కార్యాలయాలు (ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, దువ్వూరు, కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, వేంపల్లె, పులివెందుల) ద్వారా దాదాపు రూ. 7 కోట్ల ఆదాయం సమకూరనుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆస్తి విలువలు పెంచడం జరుగుతోంది.
 
భూముల విలువలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరు నుంచి పది శాతం, పట్టణప్రాంతాల్లో 10 నుంచి 25 శాతం వరకు ముఖ్యంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో భారీగా పెరిగాయి. ఇందులో నిర్మాణాలకు నోచుకుంటున్న అపార్టుమెంట్లు, కొత్త భవనాల రిజిస్ట్రేషన్‌ ఫీజులు అధికంగా పెరిగాయి. దీంతో జిల్లా ప్రజలకు రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా నిర్వహించే లావాదేవీలపై భారం పడనుంది. కడప డివిజన్‌లో గత సంవత్సరం రూ. 85 కోట్ల లక్ష్యం కాగా, ఈ సంవత్సరం ధరలు పెరగడంతో దాదాపు రూ. 13 కోట్ల ఆదాయం పెరగనుంది.

మొత్తంగా రూ. 100 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ప్రొద్దుటూరు డివిజన్‌ పరిధిలో గత సంవత్సరం రూ. 50 కోట్లు లక్ష్యం కాగా, పెరిగిన ధరలతో మరో రూ. 7 కోట్లు మొత్తం కలిపి రూ. 57 కోట్ల ఆదాయం సమకూరనుంది. జిల్లా వ్యాప్తంగా రూ. 157 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. జిల్లాలో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆస్తుల విలువను పెంచడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ధరలు పెరుగుతున్నాయని తెలియడంతో గత వారం రోజులుగా కొనుగోలుదారులతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)