amp pages | Sakshi

తెలంగాణ దారిపట్టిన ధాన్యం

Published on Fri, 01/30/2015 - 02:31

రోజుకు 40 వేల నుంచి 50 వేల బస్తాల వరకు తరలింపు
ఏపీలో అనుకూలంగా లేని లెవీ సేకరణ విధానాలు
ధాన్యం విక్రేతలకు  చెక్కులు ఇవ్వాలని ఆదేశాలు
స్థానిక మిల్లర్లకు అమ్మేందుకు  రైతుల విముఖత

 
నరసరావుపేట వెస్ట్ : లెవీ సేకరణ విధానం అనుకూలంగా లేకపోవడంతో ఇక్కడి ధాన్యం తెలంగాణకు తరలిపోతోంది. నిత్యం 40 వేల నుంచి 50 వేల బస్తాల వరకు ధాన్యం తెలంగాణ లోని నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు మిర్యాలగూడకు చేరుతోంది. అంతేకాక అక్కడి నుంచి బియ్యం భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో  బియ్యం ధరలకు రెక్కలు వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవు తోంది. లెవీ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి నేరుగా డబ్బు చెల్లించకుండా చెక్‌ల రూపంలో ఇవ్వాలని జిల్లాలోని మిల్లర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో మిల్లర్లకు ధాన్యం విక్రయించేందుకు రైతులు వెనుకాడుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న బయ్యర్లవైపు మొగ్గు చూపుతున్నారు.లెవీ సేకరణకు సంబంధించి మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంలో 25 శాతం ప్రభుత్వానికి ఇచ్చి మిగిలిన సరుకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే 75 శాతం ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం మిల్లర్లకు లేకపోవటం, విక్రయిస్తే రెండు మూడు నెలలకు సొమ్ము చేతికొచ్చే పరిస్థితులు ఉండటం వంటి కారణాలతో మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు వెనుకంజవేస్తున్నారు.

అంతేగాక కొనుగోలు చేసిన ధాన్యానికి చెక్కులు ఇస్తామంటే రైతులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం రుణమాఫీని సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల చెక్కులను బ్యాంకుల్లో జమచేస్తే బాకీ కింద మినహాయించుకునే పరిస్థితులు ఉన్నాయని రైతులు మిల్లర్లకు ధాన్యం అమ్మేందుకు విముఖత చూపుతున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం లెవీసేకరణ విధానాలను సరళతరం చేసిందని ఇక్కడికి వస్తున్న బయ్యర్లు చెపుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ము చేతిలోపెడుతున్నారు. దీంతో జిల్లా నుంచి భారీ స్థాయిలో ధాన్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాలో ధాన్యం నిల్వలు తగ్గి బియ్యంపై ఇతర రాష్ట్రాలపై ఆధార పడాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీని వల్ల రానున్న రోజుల్లో  బియ్యం ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బీపీటీ బియ్యం బహిరంగ మార్కెట్‌లో రూ.40లు ఉండగా రానున్న రోజుల్లో రూ.50లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)