amp pages | Sakshi

సర్వేకి వెళితే ఛీత్కారమే!

Published on Fri, 09/19/2014 - 01:42

సాక్షి, రాజమండ్రి : పింఛన్ మొత్తాన్ని పెంచడానికి ముందే.. రకరకాల సాకులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి సర్వే పేరుతో చంద్రబాబు సర్కారు పన్నిన కుతంత్రం.. వడ్డనకు ముందే కొంతమందిని పంక్తిలోంచి లేపేసే కుయుక్తి లాంటిదేనని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఓవైపు రుణమాఫీ హామీని అమలు చేయకుండా కుత్సితంతో తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడుపై రైతులు, డ్వాక్రా మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతుండగా.. ఇప్పుడు పింఛన్ల సర్వే ప్రజల్లో నిరసన జ్వాలను రగిల్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భయపడుతున్నారు.
 
 అందుకే పింఛన్ల సర్వేకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన  కమిటీల్లో చేరేందుకు వెనుకాడుతున్నారు. సర్వే పేరుతో.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కొందరిని లబ్ధిదారులుగా రద్దు చేసినా, తమ పార్టీ వారిని లబ్ధిదారులుగా చేర్చినా ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని బెంబేలెత్తుతున్నారు. పింఛన్ల సర్వేకు ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మండల కమిటీల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీల్లో వార్డుల కమిటీల్లో కౌన్సిలర్లు, నగర పాలక సంస్థల్లో డివిజన్ల కమిటీల్లో కార్పొరేటర్లను భాగస్వాములను చేశారు. మొదట్లో వీరంతా తమకేదో హోదా దక్కినట్టు సంబరపడ్డా.. ఈ సర్వేపై ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసన గ్రహించాక ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నారు.
 
 సర్కారు పింఛన్ల సర్వే కోసం కమిటీల్ని నియమించగానే లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. ముం దస్తు ప్రచారం లేకుండా హడావిడిగా కమిటీలు వేసి సర్వే అంటే ఎలా అని తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో సర్వే పేరుతో ఇళ్లకు వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు. కమిటీలపై జీఓ వెలువడిన దగ్గర నుంచి గురువారం సాయంత్రం వరకూ టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు అనుయాయులతో సమావేశమవుతూ.. సర్వేలో పాల్గొంటే ఎదురయ్యే పరిణామాలపై చర్చిస్తున్నారు. వారిలో అత్యధికులు శుక్రవారం నుంచి మొదలవుతున్న సర్వేకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
 
 అధికారులను పాపాలభైరవులను చేద్దాం..
 ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారిలో నూరు శాతం గత ప్రభుత్వాలు ఎంపిక చేసిన వారే. వీరిలో 80 శాతం పైగా పింఛన్లు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చినవరంగా భావిస్తున్నారు. అప్పటి వరకూ రూ.75గా ఉన్న పింఛన్ మొత్తాన్ని వైఎస్ అధికారంలోకి రాగానే రూ.200కు పెంచారు. పేదల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తామని వాగ్దానాలిచ్చిన చంద్రబాబు..గద్దెనెక్కాక వాటి అమలుకు పూనుకోకపోగా..నిస్సిగ్గుగా, నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టే ఎత్తులు వేస్తున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన జనం ఇప్పటికే సర్కారు వంచనపై నిప్పులు కక్కుతున్నారు. ఇప్పుడు పింఛన్ల సర్వే పేరుతో జనం మధ్యకు వెళితే ఆ కాక తమకు తప్పదని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. ఆ అవస్థను, పేదల పొట్ట కొటామన్న అపప్రథను తప్పించుకోవడానికి.. పింఛన్ల ఏరివేతకు అధికారులనేబాధ్యులను చేస్తే పోలా అనుకుంటున్నారు. కమిటీల్లో సభ్యులుగా ప్రజల ముందుకు వెళ్లరాదని నిర్ణయించుకుంటున్నారు. అప్పుడు ప్రజలు అధికారులనే పాపాపాపాల భైరవులుగా పరిగణిస్తారని ఆశిస్తున్నారు. ఈ తంతును అధికారులతోనే కానిచ్చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరుతున్నారు.
 
 రద్దు చేస్తామంటే జనం ఊరుకోరు
 క్షేత్రస్థాయిలో పింఛన్ల సర్వే మా వంటి ప్రజా ప్రతినిధులకు ఇబ్బంది కలగజేస్తుంది. గతంలో ఇచ్చిన పింఛన్లను రద్దు చేస్తామంటే జనం ఊరుకోరు. మరింత మంది అర్హులను గుర్తించి వారికీ పింఛన్లిస్తేనే జనం హర్షిస్తారు. లేదంటే ఇదికూడా ఓ రాజకీయంగా పరిగణిస్తారు.
 - ఇజ్జరపు రాజశేఖర్, కౌన్సిలర్, పెద్దాపురం
 
 వార్డుల్లోకి వెళితే తిరగబడతారు
 ప్రభుత్వ నిర్ణయం సమంజసమైంది కాదు. వార్డుల్లోకి వెళ్తే జనం తిరగబడేలా ఉన్నారు. గతంలో కూడా అర్హతను చూసే కదా పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సర్వే పేరుతో తొలగిస్తామంటే జనం ద్వేషిస్తారు. కార్పొరేటర్లు జనం మధ్య తిరిగే అవకాశం కోల్పోతారు. కమిటీల కూర్పు సరైంది కాదు.
 - సంజీవరావు, రిటైర్డ్ జడ్జి, కో ఆప్షన్ సభ్యుడు, రాజమండ్రి
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)