ఏపీ ప్రత్యేక హోదాకు ఉమ్మడిగా పట్టు పట్టాలి

Published on Sun, 09/21/2014 - 03:33

టీడీపీ, బీజేపీ ఎంపీల సమావేశంలో నిర్ణయం
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచిన విధంగా ఏపీకిప్రత్యేక హోదా సాధించుకోవడానికి టీడీపీ, బీజేపీ ఎంపీలంతా ఒక్కటై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని రాష్ట్రంలో అధికార టీడీపీ ఎంపీలు కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంపై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్ట్యా ఈ విషయంపై రెండు పార్టీల ఎంపీలూ గట్టిగా పట్టు పట్టాల్సిందేనన్నారు.
 
  రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ చేసిన డిమాండ్‌ను.. ఇప్పుడు వారి పార్టీ అధిష్టానవర్గానికి గుర్తుచేయాలని ఆ ఎంపీలను టీడీపీ ఎంపీలు కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు శనివారం విజయవాడలో తొలిసారి సమావేశమయ్యారు. టీడీపీపీ నేత సుజనాచౌదరి ఆహ్వానం మేరకు సమావేశానికి బీజేపీ ఎంపీలు సైతం హాజరయ్యారు. సమావేశం వివరాలను సుజనాచౌదరి ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు.
 
 రమేష్, శివప్రసాద్‌ల డుమ్మా...
 టీడీపీ ఎంపీల సమావేశానికి ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌లు డుమ్మా కొట్టారు. సుజనా నాయకత్వంలో జరిగినందునే రమేష్ హాజరుకాలేదని సహచర ఎంపీలు వ్యాఖ్యానించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ