వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
చింతపల్లిలో టీడీపీ నేతల దౌర్జన్యం
Published on Wed, 02/06/2019 - 13:41
గుంటూరు, కారంపూడి(మాచర్ల): మండలంలోని చింతపల్లి గ్రామంలో టీడీపీ నేతలు రజకులపై దౌర్జన్యానికి తెగబడ్డారు. టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టిన నేపథ్యంలో రజకుల బజారుపై దండెత్తి అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను ఎవరో తగులబెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు రజకుల ఇళ్లపైకి వచ్చి పరుషపదజాలంతో దూషిస్తూ, అడ్డువచ్చిన శివ అనే యువకుడిని గాయపర్చారని వైఎస్సార్సీపీ నేత అలుగునూరి అమరయ్య, మహిళలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సమీపంలో బావిపై వేసుకున్న మోటారును ధ్వంసం చేసి పైపులను కోశారని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి పంగులూరి రామకృష్ణయ్య ఫిర్యాదు చేశారు. తమ ఫ్లెక్సీలను వైఎస్సార్సీపీ నేతలు తగులబెట్టారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి ఎస్ఐ మురళి గ్రామంలో విచారణ చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గ్రామంలో ఇలాంటి కవ్వింపు చర్యలకు ఎవరూ పాల్పడవద్దని ఇరుపార్టీల వారికి ఎస్ఐ విజ్ఞప్తిచేశారు.
Tags