amp pages | Sakshi

టీడీపీ నేతల మైండ్‌గేమ్‌!

Published on Sun, 04/22/2018 - 11:43

మచిలీపట్నం సబర్బన్‌ : మండల పరిధిలోని పోతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం టీడీపీ నేతల ‘పచ్చ’పాతం మరోమారు బహిర్గతం అయ్యింది. కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్‌ సీపీ పంచాయతీ వార్డు మెంబర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించుకోవడం గ్రామంలో అలజడి రేపింది. పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి వస్తే పార్టీ మారినట్లు తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని వార్డు మెంబర్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా ప్రచారం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఇతర టీడీపీ నేతల చర్యను వారు తప్పుబడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. గత పంచాయతీ ఎన్నికల్లో పోతేపల్లి గ్రామంలో టీడీపీ మట్టి కరిచింది. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌ సీపీకి చెందిన అభ్యర్థులే గెలుపొందారు. 10 వార్డులకు గానూ సర్పంచ్‌తో పాటు 7 వార్డు మెంబర్‌లు వైఎస్సార్‌ సీపీ అనుయాయులే విజయం సాధించారు. దీంతో కంగుతున్న టీడీపీ నేతలు గ్రామంలో పార్టీ పటిష్టత కోసం విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో దొడ్డిదారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఇదే తరహా కుట్ర చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బలవంతంగా కండువాలు కప్పి..  
గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనం స్థానంలో ఇటీవల కొత్తది నిర్మించారు. ఆ భవన ప్రారంభోత్సవానికి శనివారం మధ్యాహ్నం టీడీపీ నాయకులతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు గ్రామానికి చేరుకున్నారు. పంచాయతీ భవనం కావడంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన పంచాయతీ వార్డు మెంబర్‌లు మాదిరెడ్డి లక్ష్మి, కాగిత లక్ష్మీవీరరాఘవమ్మ, మాదిరెడ్డి నాగరత్నం, పాలంకి సునీత, పాలంకి వరలక్ష్మి హాజరయ్యారు. మర్యాదపూర్వకంగా మంత్రి కొల్లు రవీంద్రను కలిశారు. ముందస్తు వ్యూహంతోనే గ్రామానికి వచ్చిన టీడీపీ నేతలు వెంటనే కుట్రకు తెర తీశారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. అయితే, ఆ సమయంలో గ్రామస్తుల మధ్య ఏమీ మాట్లాడలేకపోయామని వార్డు మెంబర్లు తెలిపారు. తామంతా వైఎస్సార్‌ సీపీలోనే కొనసాగుతామని సభ అనంతరం వారు వెల్లడించారు. 

గతంలోనూ..
టీడీపీ గతంలోనూ ఇదే తరహా కుతంత్రాలకు పాల్పడింది. ఇటీవల పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. దీంతో కంగుతిన్న మంత్రి కొల్లు రవీంద్ర మండల పరిధిలోని ఎస్‌ఎన్‌ గొల్లపాలెంలో రోడ్డుపై ప్రయాణించే ట్రాక్టర్‌ డ్రైవర్‌లను, అటుగా సైకిల్‌పై వెళ్లే గ్రామస్తులను ఆపి టీడీపీ కండువాలు కప్పారు. అక్కడితో ఆగకుండా గ్రామంలో కొందరు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరినట్లు ఆయనే ప్రకటించుకున్నారు. ఈ కుటిల రాజకీయాన్ని అప్పట్లోనే ‘మంత్రి వర్యా.. ఇదేం పనయ్యా’ అనే కథనంతో ‘సాక్షి’ బహిర్గతం చేసింది. తాజాగా పోతేపల్లిలోనూ ఇదే తరహాలో టీడీపీ నాయకులు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. 

ప్రజా మన్ననలు పొందలేక దొడ్డిదారి రాజకీయాలు.. 

గడిచిన మూడున్నరేళ్లలో టీడీపీ నాయకులు రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ప్రజలకు రాక్షస పాలన ఎలా ఉంటుందో చవి చూపించారు. పాలనలో పారదర్శకత లోపించింది. ఎన్నికల హామీలు అమలు చేయలేదు. తాగునీరు, సాగు నీరు లేదు. రైతులను నట్టేట ముంచారు. గ్రామాల్లో ప్రతి పనికీ ఓ రేటు కట్టి జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజలను వేధిస్తున్నారు. దీంతో ప్రజలే తిరగబడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు దొడ్డిదారి రాజకీయాలు ప్రారంభించారు. వారెన్ని కుట్రలు చేసినా ప్రజల మన్ననలు పొందలేరు. 
– పిప్పళ్ల నాగేంద్రప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు, పోతేపల్లి   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)