అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
భూములు మింగేశారు..
Published on Sat, 12/22/2018 - 08:07
శ్రీకాకుళం :‘బాబు.. నా తండ్రి తలయారీగా పనిచేశారు. ఆయకు ప్రభుత్వం ద్వారా రెండు ఎకరాలు భూమి జీవనోపాధికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భూమిని నమ్ముకుని కుటుంబా న్ని పోషించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం తుమ్మసాగంలో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లో భాగంగా మా భూమిని చెరువులో కలిపేశారు’ అని సంతబొమ్మాళి మండలం తాళ్లవలసకు చెందిన కురమాన పెద్దవెంకయ్య అన్నారు. తమ దళితులకు సంబంధించి మరో 19 మంది భూములు పోయాయని చెప్పారు.
పేదలను ఆదుకోవాలి
‘నాయనా.. పేదలను ఆదుకోండి. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్యా యం జరుగుతోంది. నా భర్త కుత్తమ అప్పలస్వామి ఆరు నెలల కిందట మృతిచెందారు. ఇంతవరకు వితం తు పెన్షన్ మంజూరు కాలేదు’ అని సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్రకు చెందిన కుత్తమ మహాలక్ష్మి అన్నారు. ప్రమాదంలో కాళ్లు, వెన్నెముక విరిగిపోవడంతో మృతి చెందారని, చంద్రన్న బీమా కూడా రాలేదని తెలిపారు.
Tags