చెప్పులతో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

Published on Thu, 04/27/2017 - 16:05

అనంతపురం : అనంతపురం జిల్లాలో  తెలుగు తమ్ముళ్లు పర్పసర్పరం చెప్పులతో కొట్టుకుని వీరంగం సృష్టించారు. జిల్లా గుంతకల్లు టీడీపీ సమావేశం సందర్భంగా జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది. గుంతకల్లు పట్టణంలోని పరిటాల కళ్యాణ మండపంలో టీడీపీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికలు జరిగాయి.

గుంతకల్లు రెండో వార్డు ఇంఛార్జ్ పదవి కోసం టీడీపీ కౌన్సిలర్ గుణశేఖర్, మాజీ కౌన్సిలర్ మస్తానప్ప పోటీ పడ్డారు. ఇద్దరి మధ్యా వివాదం పెరగటంతో ఇరువర్గాలూ చెప్పులతో కొట్టుకున్నారు. మాజీ కౌన్సిలర్ మస్తానప్పను గుణశేఖర్ వర్గీయులు చెప్పులతో కొట్టారు. కాగా ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, కడప నుంచి వచ్చిన టీడీపీ పరిశీలకుడు అమీర్ బాషా సమక్షంలోనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడున్నవాళ్లు... ఇరువర్గాలను విడదీసేందుకు తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ