amp pages | Sakshi

డొంక కదులుతోంది !

Published on Mon, 02/10/2020 - 12:03

మంగళగిరి: టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు రాజధాని గ్రామాల్లో చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూసమీకరణ పేరుతో రైతులను దగా చేసిన టీడీపీ ప్రభుత్వంతో పాటు నాయకులు, కార్యకర్తలు దళితులను మోసం చేసి వందలాది ఎకరాలు అసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో భూమాయపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలతో పాటు మరికొందరుపై కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పుడు రాజధానిలో 106 భూలావాదేవీలపై విచారణ జరపాలని సీఐడీ అధికారులు ఆదాయపు పన్నుశాఖ అధికారులకు లేఖ రాసింది. దీంతో టీడీపీ నాయకులు, భూములు కొన్న వారు కలవరపడుతున్నారు. 106 భూ లావాదేవీలలో అధికంగా 95 లావాదేవీలు మండలంలోని కురగల్లు గ్రామంలో ఉండడం విశేషం. 2018, 2019 సంవత్సారాలలో జరిగిన లావాదేవీపై విచారణ జరపాలని సీఐడీ విభాగం ఆదాయపుపన్నుశాఖను కోరింది. 

కురగల్లులో 550 ఎకరాల అసైన్డ్‌ భూములు...
మండలంలోని కురగల్లు గ్రామంలో 550 ఎకరాలు అసైన్డ్‌ భూములున్నాయి. రాజధాని ప్రకటించిన వెంటనే గద్దల్లా వాలిన టీడీపీ నాయకులు అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదని, తమకు విక్రయిస్తే ఎంతో కొంత ఆదాయం వస్తుందని దళితులను భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో  ఆందోళనకు గురయిన భూ యజమానులు ఎంతో కొంత వస్తుందని భావించి ఎకరం రూ.10 నుంచి 20 లక్షల లోపు అమ్ముకున్నారు. మండలంలోని నీరుకొండ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, 2004 గుంటూరు పార్లమెంట్‌కు పోటీ చేసిన టీడీపీ నేత ఏకంగా గ్రామంలో 300 ఎకరాల అసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న మరో టీడీపీ నాయకుడు వంద ఎకరాలకుపైగా కొనుగోలు చేసి ఆ భూములను రాజధాని భూసమీకరణకు ఇచ్చి పరిహారంగా ప్లాట్లు పొంది వాటిని విక్రయించడం ద్వారా వందల కోట్లు అక్రమంగా ఆర్జించారు. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసి పరిహారంగా వచ్చిన ప్లాట్లును విక్రయించి కోట్లు ఆర్జించిన నాయకులు 2019లో జరిగిన ఎన్నికలలో లోకేష్‌ గెలుపు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారనే విమర్శలున్నాయి. ఇప్పటికే గ్రామానికి చెందిన రైతు తమను మోసం చేసి భూములు కొనుగోలు చేశారని సీఐడీకి ఫిర్యాదు చేయగా అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రాజధానిలో జరిగిన భూలావాదేవిలపై విచారణ జరపాలని ఆదాయపు పన్నుశాఖను రాతపూర్వకంగా కోరడం అటు టీడీపీ నాయకులతో పాటు వారి అండతో భూములు కొనుగోలు చేసిన వారిని ఆందోళనకు గురిచేస్తున్నట్లు సమాచారం. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్