amp pages | Sakshi

యూనివర్సిటీ  ప్రకాశించేనా..!

Published on Mon, 10/14/2019 - 11:20

సాక్షి, ఒంగోలు(ప్రకాశం) : ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు చివరి ఏడాది ఒంగోలుకు యూనివర్సిటీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఈ ప్రకటన వెలువడటంతో జిల్లాలోని పీజీ చదవాలనుకునే విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్శిటీకి మౌలిక వసతుల కోసం అప్పటి ఇన్‌చార్జి వైస్‌ ఛాన్సలర్‌ సుదర్శనరావు రూ.126 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.10 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. చివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా చిన్నచూపు చూసింది. ఒంగోలులో యూనివర్సిటీ ఉన్నప్పటికీ దానికి నిధులు విడుదల చేయకపోవడంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్‌గానే చెలామణి అవుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడటం, రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ నియమితులు కావడంతో యూనివర్సిటీకీ త్వరలోనే జవసత్వాలు వస్తాయని విద్యార్థులు ఆశగా ఉన్నారు. 

ఫస్ట్‌ ఇయర్‌ యూనివర్సిటీ..సెకండ్‌ ఇయర్‌ పీజీ సెంటర్‌:
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ కింద, సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న వారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్‌ కింద ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ నడుస్తున్న పీజీ సెంటర్‌ను యూనివర్సిటీగా మార్చినప్పటికీ దానికి సంబంధించిన విభజన ఇంత వరకు జరగలేదు.  ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్‌ ఇయర్‌లో 124 మంది, సెకండ్‌ ఇయర్‌లో 214 మంది చదువుకుంటున్నారు. వాస్తవానికి యూనివర్సిటీ ఉంటే ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ కలిపి 1500 నుంచి 2 వేల మంది విద్యార్థులు ఉంటారు. అయితే అందుకు విరుద్ధంగా కేవలం 338 మంది విద్యార్థులతో నామమాత్రపు యూనివర్సిటీతోపాటు పీజీ సెంటర్‌ను నెట్టుకు వస్తున్నారు. 

డిపార్ట్‌మెంట్‌లు తక్కువ.. కోర్సులు తక్కువ: 
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీకి సంబంధించి గత ప్రభుత్వం ప్రకటన చేయడం తప్పితే తదుపరి దృష్టి సారించకపోవడంతో దాని ప్రభావం ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌లకు సంబంధించి కేవలం ఎనిమిది డిపార్ట్‌మెంట్లు, పది కోర్సులు మాత్రమే ఉన్నాయి. దానికితోడు సైన్స్‌ కోర్సులకు ల్యాబ్‌లు లేకపోవడంతో విద్యార్థులు ఇక్కడ చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆర్ట్స్‌ కోర్సులతోపాటు స్టాటిస్టిక్స్, మ్యాథ్స్‌ కోర్సులను  నిర్వహిస్తున్నారు. వాస్తవానికి యూనివర్శిటీ పూర్తి స్థాయిలో ఏర్పడి ఉంటే డిపార్ట్‌మెంట్లు పెరగడంతోపాటు కోర్సులు కూడా పెరిగేవి. యూనివర్సిటీ విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేది. అయితే యూనివర్శిటీకి సంబంధించి ఎలాంటి కదలిక లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ చేసేందుకు నాగార్జున యూనివర్సిటీ వైపే మొగ్గు చూపారు. 

రూ.కోటి భవనం నిరుపయోగం:
ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్ట వద్ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి 110 ఎకరాల స్థలం ఉంది. పీజీ సెంటర్‌లో చదువుకునే విద్యార్థుల కోసం అక్కడ కోటి రూపాయలతో రెండేళ్ల క్రితం భవనాన్ని నిర్మించారు. రూ.70 లక్షలతో చుట్టూ ప్రహరీ నిర్మించారు. అయితే కోటి రూపాయల భవనం నిరుపయోగంగా ఉంది. పీజీ సెంటర్‌కు హాస్టల్‌ నిర్మాణం జరిగిన ప్రాంతం దూరంగా ఉండటం, విద్యార్థుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో ఆ హాస్టల్‌ నిరుపయోగంగా ఉంది. 

జగన్‌ ప్రభుత్వం దృష్టి:
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీౖపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ యూనివర్సిటీకి నెల్లూరులోని సింహపూరి యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ సుదర్శనరావును ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా గత ప్రభుత్వం నియమించింది. ప్రకాశం యూనివర్శిటీతో కలుపుకుంటే సుదర్శనరావు మూడు యూనివర్సిటీలకు వైస్‌ చాన్సలర్‌గా ఉండటంతో ఆయన స్థానంలో జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ను ఇన్‌చార్జి వైస్‌ ఛాన్సలర్‌గా ప్రభుత్వం నియమించింది. విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ జిల్లాకు చెందినవారు కావడంతో యూనివర్సిటీకి సంబంధించిన కదలిక కలెక్టర్‌ తీసుకువస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)