amp pages | Sakshi

ప్రాణం తీస్తున్న ఎండలు

Published on Sun, 05/24/2015 - 04:47

వడ దెబ్బతో 17 మంది మృత్యు వాత
 
►జిల్లాలో ముదిరిన ఎండలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. శనివారం ఒక్కరోజే 17 మంది వడదెబ్బతో మృతి చెందారు. పిల్లలు, వృద్ధులు, ఉపాధి కూలీలు ఎండల ధాటికి బెంబేలెత్తుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
►ఎర్రగుంట్ల నగర పంచాయతి పరిధిలోని వేంపల్లిరోడ్డులోని దళితవాడకు చెందిన వెంకటసుబ్బయ్య(55) అలియాస్ భద్రయ్య అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు తోపుడు బండిపై నిర్వహించే టిఫిన్ సెంటర్‌ల వద్ద కార్మికునిగా పనిచేస్తున్నాడు.

► అక్కా తమ్ముడు..
 చిట్వేలి మండల పరిధిలోని కేఎస్ అగ్రహారం సంగాదేవపల్లెలో ఒకే కుటుంబానికి చెందిన సుబ్బమ్మ(85), చేతిపట్టు వెంకటయ్య(75) మృతి చెందారు. వీరిద్దరూ అక్కాతమ్ముడు కావడం గమనార్హం.

►పుల్లంపేట మండల పరిధిలోని కొమ్మనవారిపల్లె గ్రామానికి చెందిన పోలి.చంగల్‌రెడ్డి(90) ఎండతీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు.
  పోరుమామిళ్లకు చెందిన దుద్యాల సుబ్బమ్మ(80) అనే వృద్ధురాలు మృతి చెందింది.

►పెనగలూరు మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన మహబూబ్‌బీ(70) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
►కడప నగర శివార్లలోని రామరాజుపల్లెలో పుష్పగిరి గంగమ్మ(68) అనే వృద్ధురాలు వడదెబ్బతో  మృతి చెందింది. ప్రతిరోజూ పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించే ఆమె ఇటీవల ఎండలు ఎక్కువ కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురై శనివారం మృతిచెందింది.
►ఒంటిమిట్ట  మండలం చప్పిటవారిపల్లె గ్రామంలో ఓబులమ్మ(65) ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతిచెందింది.  
►వేముల మండలం బెస్తవారిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు.
►రైల్వేకోడూరు మండల పరిధిలోని రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన పెంచలమ్మ(50) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
►రాజంపేట మండలం సీతారామాపురం గ్రామంలో వెలకచెర్ల వెంకటరెడ్డి(60) వడదెబ్బతో మృతి చెందాడు.
►బద్వేలు మండల పరిధిలోని వేర్వేరు గ్రామాలలో శనివారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని రాజుపాళెం పంచాయతీ అప్పరాజుపేట గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి చెన్నమ్మ(62),బోవిళ్లవారిపల్లె గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన వారిలో ఉన్నారు.
►బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లె గ్రామంలో జె.అచ్చమ్మ (75)అనే వృద్ధురాలు వడ దెబ్బతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.  
►సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాలి రామయ్య (55) వడదెబ్బతో మృతి చెందారు. రామయ్య శుక్రవారం వ్యవసాయ కూలి పనికి వెళ్లారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ తగిలిందని  కుటుంబీకులు తెలిపారు.  ఇదే మండలం  జంగాలపల్లె  గ్రామం దళితవాడకు చెందిన పాలెం వెంకటలక్షుమ్మ (65) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
►రైల్వేకోడూరు పట్టణం పగడాలపల్లెకు చెందిన మర్రిసుబ్బయ్య (70) మృతి చెందినట్లు ఆయన భార్య కృష్ణమ్మ తెలిపింది.
►ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామంలో తులసి రామిరెడ్డి(65) మృతి చెందాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)