amp pages | Sakshi

రైతును వీడని ఆన్‌లైన్‌ కష్టాలు

Published on Mon, 06/17/2019 - 12:17

సాక్షి, బలిజిపేట (విజయనగరం): గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను ఇంకా అవస్థలకు గురిచేస్తోంది. భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియ సంవత్సరాలు గడిచినా నేటికీ పూర్తికాకపోవడంతో సబ్సిడీ విత్తనాలకు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో సబ్సిడీ విత్తనాలు అందక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందంటున్నారు. గత ప్రభుత్వం ‘మీ ఇంటికి–మీ భూమి’ కార్యక్రమాన్ని పెట్టి ఊదర్లు కొట్టింది తప్పా కార్యాచరణ పూర్తిచేయలేదని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు అవసరమైనన్ని విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు పొందాలంటే భూమి ఆన్‌లైన్‌ జరగడం, ఆన్‌లైన్‌ అయిన భూమికి ఆధార్‌ అనుసంధానం అవడం తప్పనిసరి కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మండలంలో ఖరీఫ్‌ సీజనులో సాగు విస్తీర్ణం 6వేల హెక్టార్లు. అవసరమైన విత్తనాలు 4,500 క్వింటాళ్లుగా అంచనా. ప్రభుత్వం, వ్యాపారులు కలిపి వీటిని అందించాల్సి ఉంది.నిబంధనల ప్రకారం ప్రభుత్వం సరఫరా చేయనున్న విత్తనాలు 35శాతం. కాగా మండలానికి వచ్చిన సబ్సిడీ విత్తనాలు 2,080.50 క్వింటాళ్లు. కాగా ప్రైవేటు వ్యాపారులు పెట్టిన ఇండెంట్‌ 2,450 క్వింటాళ్లు. కాగా వచ్చిన సబ్సిడీ విత్తనాలలో విక్రయించినవి 1,275క్వింటాళ్లు. మిగిలి ఉన్నవి 805 క్వింటాళ్లు. ఖరీఫ్‌కు సాగుచేయనున్న రైతులు 20వేల మంది కాగా భూములు ఆన్‌లైన్‌ అయినవారు 60శాతం మాత్రమే ఉన్నారు. భూములు ఆన్‌లైన్‌ అయినవారిలో ఆధార్‌ అనుసంధానం కాని రైతులు 30 శాతం వరకు ఉన్నారని తెలుస్తోంది.

భూములు పూర్తిగా ఆన్‌లైన్‌ కాని రైతులు 40 శాతం వరకు ఉన్నారు. ఈలెక్కన ఆన్‌లైన్‌ అవక నష్టపోతున్న రైతులు చాలావరకు కనిపిస్తున్నారు.  వీరు ప్రైవేటుగా విత్తనాలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.  ఆన్‌లైన్‌ అంటూ గత ప్రభుత్వంలో చాలావరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక బ్యాంకు రుణాలు పొందేటపుడు ఆన్‌లైన్‌ జరగని, ఆధార్‌లింక్‌ అవని భూములకు సంబంధించి రుణాలు పొందే అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలు సంభవించేటప్పుడు అసలైన రైతులు నష్టపోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి ఆన్‌లైన్‌ వ్యవస్థను సరిచేయాలని కోరుతున్నారు.

ఆన్‌లైన్‌ కాకపోవడంతో విత్తనాలు అందడం లేదు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌ అన్నారు తప్పా భూములను ఆన్‌లైన్‌ చేయలేదు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. విత్తనాలు కావాలన్నా, ప్రభుత్వ లబ్ధి పొందాలన్నా ఆన్‌లైన్, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అవడంతో నష్టపోయాం.
–వెంకటరమణ, నూకలవాడ, బలిజిపేట మండలం

ఖరీఫ్‌కు అన్నీ కొత్తవిత్తనాలే
ప్రస్తుత ఖరీఫ్‌కు అన్నీ కొత్త విత్తనాలే అవడంతో సాగుచేస్తున్న ప్రతిరైతూ విత్తనాలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరం రైతులు పండించిన పంటలో విత్తనాలను కడితే వచ్చే సీజనుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. 
– నాగేశ్వరరావు, ఏఓ, బలిజిపేట

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)