బాబే భూబకాసురుడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లక్ష్యసాధనకు సత్ప్రవర్తన అవసరం
Published on Sat, 03/25/2017 - 13:02
రాజాం: సత్ప్రవర్తనతో మెలిగినప్పుడే జీవితాశయాలు నెర వేరుతాయని విజయవాడకు చెందిన ఆల్ట్రాటెక్ సిమెంట్ జనర ల్ మేనేజర్ కె.వెంకటరామన్ అన్నారు. శుక్రవారం రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో అచీవర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయడానికి జీఎంఆర్ ఐటీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. తిరుమల ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్(రాజమండ్రి) డైరెక్టర్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులకు కఠోరదీక్ష, నిరంతర ప్రయత్నాలు ఎంతో అవసరమన్నారు.
అనంతరం దేశంలోని ప్రముఖ కళాశాలలు, యూనివర్సిటీలలో పేపర్ ప్రెజెంటేషన్, ప్రోజెక్టు డిజైన్ పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన 110 మంది విద్యార్థులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.రాజామురుగుదాస్, జీఎంఆర్ ఐటీ గవర్నింగ్ కౌన్సిలర్ మెంబర్ డాక్టర్ పీఆర్ దహియా, కన్వీనర్ డాక్టర్ జి.శశికుమార్, డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం దేశంలోని ప్రముఖ కళాశాలలు, యూనివర్సిటీలలో పేపర్ ప్రెజెంటేషన్, ప్రోజెక్టు డిజైన్ పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన 110 మంది విద్యార్థులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.రాజామురుగుదాస్, జీఎంఆర్ ఐటీ గవర్నింగ్ కౌన్సిలర్ మెంబర్ డాక్టర్ పీఆర్ దహియా, కన్వీనర్ డాక్టర్ జి.శశికుమార్, డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags