అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
‘సర్వ ఏకాదశి’కి తిరుమల ముస్తాబు
Published on Wed, 06/26/2019 - 16:01
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో విశేష ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిని అంగరంగ వైభంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. అందులో భాగంగా వచ్చే నెల ఏడవ తేదీన శ్రీ మరీచి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఆ తరువాత జూలై 12న శయన ఏకాదశితో పాటు చాతుర్మాస్య వ్రతారంభాన్ని పురస్కరించుకుని విశిష్ట పూజలు చేపట్టనున్నారు. జూలై 16న గురుపౌర్ణిమ, చంద్రగ్రహణం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించనున్నారు. మరుసటి రోజు కర్కాటక సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. జూలై 28న సర్వ ఏకాదశి వేడుకకు తిరుమల దేవస్థానం ఇప్పటినుంచే సర్వాంగ సుందరంగా ముస్తాబవనుంది.
#
Tags