amp pages | Sakshi

మ్యాచ్‌ఫిక్సింగ్... బయటపడింది

Published on Fri, 02/21/2014 - 01:56

  • కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు
  •  విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదంతో తేటతెల్లం
  •  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భాను విమర్శ
  •  జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదించటంతో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. గురువారం రాత్రి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 58 ఏళ్లు కలిసివున్న తెలుగుజాతిని అత్యంత కిరాతకంగా విభజించిన పాపం ఆ మూడు పార్టీలకే దక్కుతుందని, దీంతో భారతదేశ పార్లమెంటు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని భాను అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశంలో కేవలం తమ స్వార్థం కోసం ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మెజార్టీ సభ్యుల ఆమోదం కూడా లేకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని ఉభయసభల్లో ఆమోదించటం అప్రజాస్వామికమన్నారు. తెలుగుజాతిపై కక్షకట్టినట్లుగా వారు వ్యవహరించటం దురదృష్టకరమని చెప్పారు.

    కేంద్ర మంత్రులు దద్దమ్మల్లా కూర్చున్నారు...

    కేంద్ర మంత్రులు జేడీ శీలం, కావూరి సాంబశివరావు, చిరంజీవి కూడా చర్చ సమయంలో పల్లెత్తుమాట కూడా మాట్లాడకుండా దద్దమ్మల్లా కూర్చోవటం దారుణమని భాను విమర్శించారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం సయయంలో తెలుగుదేశం సభ్యుడు సుజనాచౌదరి బిల్లుకు ఆమోదం తెలియజేయటంతో కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయన్నారు.
     
    చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం మరోసారి రుజువైందన్నారు. దేశ చరిత్రలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా కేంద్రప్రభుత్వంతో కుమ్మక్కై మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడటం ద్వారా నీచరాజకీయాలకు తెరతీసినట్లయిందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఎం మాత్రమే కాక దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యసభలో బిల్లును వ్యతిరేకి ంచటం గమనార్హమన్నారు. దేశ ప్రజలు ఈ వ్యవహారాన్నంతా గమనిస్తున్నారని చెప్పారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన పార్టీలకు తగిన సమయంలో బుద్ధిచెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
     

Videos

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)