అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి

Published on Fri, 01/17/2014 - 21:20

ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పెంబి అటవీరేంజ్ పరిధిలో కలప అక్రమ తరలింపును అడ్డుకోబోయిన అటవీ, పోలీసు సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి తెగించారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇచ్చోడ మండలం నారాయణగూడ, ఖానాపూర్ మండలంలోని పెంబీ అటవీ పరిధిలోని రాగిదుబ్బనాల ప్రాంతంలో అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారం అందటంతో అటవీ అధికారి శంకర్, పెంబీ ఎస్సై నజీర్, తమ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి కాపు కాశారు.

ఎడ్ల బండ్లపై కలప తరలిస్తూ తారస పడిన స్మగ్లర్లను నిలువరించేందుకు వారు ప్రయత్నం చేశారు. అయితే, స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో వారిపైకి దాడికి దిగారు. ఈ ఘటనలో రేంజ్ అధికారి శంకర్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పలుసార్లు హెచ్చరించినా పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి పోలీసులు ఒక్క రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు ఒకటిన్నర లక్షల రూపాయల విలువైన 22 టేకు దుంగలు, 6 ఎండ్లబండ్లను వదిలి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. స్మగ్లర్లపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో పెంబి అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ