amp pages | Sakshi

వెన్నెల బుచ్చింపేటలో మరణమృదంగం..

Published on Tue, 03/13/2018 - 13:28

విజయనగరం, సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ వెన్నెల బుచ్చింపేట వాసులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకే నెలలో ఆరుగురు మృత్యువాడ పడగా, మరో ఇద్దరు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు, అధ్వాన పారిశుద్ధ్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో మడక కృష్ణమ్మ, గొట్టాపు సత్యం, అర్తాపు గుంపస్వామి, మూడడ్ల అప్పలస్వామి, వెన్నెల పెదసూర్యనారాయణతో పాటు పది నెలల చిన్నారి గొడబ కీర్తన కన్నుమూశారు. అలాగే బి. విజయమ్మ బొబ్బిలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో.. టి. మహాలక్ష్మి విశాఖలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు ఆరుగురు మృతి చెందినా కనీసం అధికారులు గ్రామంవైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మూలకు చేరిన రక్షిత మంచినీటి పథకం
గ్రామంలో రక్షత మంచినీటి పథకంతో పాటు నాలుగు బోరుబావులు, మూడు నేలబావులున్నాయి. ఐదేళ్ల కిందట నిర్మించిన రక్షిత మంచినీటి పథకం అప్పుడే మూలకు చేరింది. ప్రస్తుతం పాఠశాల ఆవరణలో ఉన్న బోరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు.   బోరుబావి పరిసరాలు అధ్వానంగా ఉండడం... గ్రామంలో ఎక్కడ చూసినా మురుగునీరు, చెత్తా,చెదారాలు పేరుకుపోవడంతో తాగునీరు కలుషితం అయిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కాలువలు లేకపోవడంతో మురుగునీరు ఎక్కడబడితే అక్కడే నిల్వ ఉంటోందని స్థానికులు వాపోతున్నారు.

కానరాని అధికారులు
సభలు, సమావేశాల్లో కనబడే అధికారులు గ్రామంలో ఆరుగురు మృత్యువాత పడినా కనబడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మా కష్టాలు వారికి పట్టవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

పెద్ద దిక్కును కోల్పోయాం.
గ్రామానికి చెందిన ఇద్దరు పెద్దలను కోల్పోయాం. ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయో అర్థం కావడం లేదు. అధికారులు రారు.. మరణాలు ఆగవు.. మా పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. 
– జి. రవి, ఇంజినీరింగ్‌ విద్యార్థి

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌