amp pages | Sakshi

కాలక్షేపానికి పథకాలు

Published on Wed, 10/01/2014 - 02:13

సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడ : చేతినిండా నిధులుంటేనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా ముందుకు సాగటం కష్టం. కానీ, అసలు నిధులు ఇవ్వకుండా పబ్బం గడిపేందుకు ప్రభుత్వం పలు ‘పథకాలు’ రచిస్తోంది. వాటిలో రెండు పథకాలకు అక్టోబర్ 2న శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. వాటిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం గురించి ఇప్పటికే అన్ని మార్గదర్శకాలు అధికారులకు చేరాయి. ‘జన్మభూమి-మా ఊరు’ పథకం గురించి పలుమార్లు చర్చించిన ప్రభుత్వం మంగళవారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ పథకం ద్వారా ప్రచారం ఎలా ఉండాలనే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వివరించారు.

 ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఇలా..
 ప్రతి మండల కేంద్రంలోనూ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించాలని తొలుత ప్రభుత్వం భావించింది. లీటరు మంచినీరు రూ.2కు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. నిర్వహణ కోసం స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, స్థానికంగా దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాతలు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒక ప్లాంటుకు మాత్రమే పరిమితమైంది.

అయినప్పటికీ దాతల నుంచి స్పందన లేదు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఒక్కోచోట మంచినీటి ప్లాంటు ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు గన్నవరంలో అదనంగా మూడు, జగ్గయ్యపేట, కానూరు, పెనమలూరులలో మరో మూడు ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 పెట్టుబడితో పాటు నిర్వహణ భారం కూడా దాతలపైనే..
 ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు ఖర్చవుతుంది. నిత్యం ప్లాంటులో పని చేసేందుకు ఒక ఉద్యోగి కావాలి. విద్యుత్‌ను 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కాబట్టి దాత పెట్టుబడి పెట్టడంతోపాటు మెయింటినెన్స్ కూడా చూడాల్సి రావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ, జిల్లావ్యాప్తంగా 19 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు నూజివీడులో మాత్రమే ప్లాంటు పెట్టేందుకు దాతలు ముందుకువచ్చారు. మండల అభివృద్ధి అధికారి ఒత్తిడి మేరకు ఫౌల్ట్రీ సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణస్వామి చందాలు వసూలు చేసి స్థానికంగా బస్‌షెల్టర్‌లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కురుమద్దాలిలో, గన్నవరం నియోజకవర్గంలోని రామచంద్రాపురం, తరిగొప్పల, వేలేరులలో ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పామర్రు నియోజకవర్గంలోని కురుమద్దాలి, చల్లపల్లి మండలంలోని నడకుదురు గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఐల సాయంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ప్లాంట్ల ఊసే లేదు. మరోవైపు ప్రస్తుతానికి ఒక్కో ప్లాంటుకు రూ.80వేలు మెయింట్‌నెన్స్ కోసం అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం.

 ‘జన్మభూమి-మా ఊరు’ తీరూ అంతే..
 జన్మభూమి-మా ఊరు పథకం కూడా కేవలం ప్రచారం కోసమే రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పథకం కింద గ్రామాల్లో పెన్షన్‌కు అర్హులైన వారిని గుర్తిస్తారు, హెల్త్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. గ్రామంలో మైక్రో లెవల్ ప్లానింగ్, స్వర్ణగ్రామానికి పంచసూత్రాలు, స్వర్ణపురానికి పంచసూత్రాలు, పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛాంధ్ర తదితర కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తారు. అందరూ భావిస్తున్నట్లు 70శాతం ప్రభుత్వ నిధులు, 30 శాతం ప్రజల నిధులతో పనులు చేసేందుకు  అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

 జాగ్రత్తగా ఉండండి...
 అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, రైతులు రుణమాఫీపై నిలదీసే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)