amp pages | Sakshi

మట్టి దొంగలు

Published on Wed, 09/12/2018 - 14:00

తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించారు. అధికారం చేతిలో ఉందని అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు.  ఏకంగా ఎస్‌ఆర్‌బీసీ ర్యాంప్‌ మట్టిని తోడేసి మైనర్‌ ఇరిగేషన్‌ రస్తాలకు తరలిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో వారి అక్రమ దందా బయటపడింది.    

కర్నూలు, సంజామల:  గిద్దలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గిద్దలూరు, మిక్కినేనిపల్లె, రామభద్రునిపల్లె, మంగపల్లె గ్రామాల్లోని  రైతుల పొలాలకు రస్తాల నిర్మాణం కోసం  ప్రభత్వం నిధులు మంజూరు చేసింది. మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ తరపున జరిగే ఈ పనులను నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత అనుచరుడు దక్కించుకున్నాడు. రస్తాలకు రెడ్‌ గ్రావెల్‌ వినియోగించాలి.  గిద్దలూరు, మిక్కినేనిపల్లె గ్రామాల సమీపంలో వెలసిన కొండల్లో ఆ గ్రావెల్‌ దొరుకుతుంది. కానీ, సదరు కాంట్రాక్టర్‌ అంత శ్రమ ఎందుకనుకున్నాడో ఏమో గిద్దలూరు సమీపంలోని కమ్మోరుపల్లె రహదారిలో ఎస్‌ఆర్‌బీసీ  (శ్రీశైలం రైట్‌ బ్రాంచ్‌ కెనాల్‌) 17వ బ్లాకు  నిర్మాణానికి ఏర్పాటు చేసిన ర్యాంపు మట్టిపై కన్నేశాడు.  జేసీబీ ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా  గత వారం రోజులుగా ఆ మట్టిని అక్రమంగా   రహదారి పనులకు తరలించాడు. కాలువ నిర్మాణ పనులు పూర్తికాకముందే అక్కడి మట్టిని తరలించారు. దిగువ ప్రాంత రైతులకు నీరందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, ఆయన అకాల మరణంతో 2010 నుంచి నిధులు మంజూరు కాక కిలోమీటరున్నర  కాలువ పనులు ఆగిపోయాయి.  ఆ  పనులు పూర్తి చేయించాల్సింది పోయి అక్కడి మట్టినే టీడీపీ నేతలు తరలించడం గిద్దలూరు గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. దీనిపై ఎస్‌ఆర్‌బీసీ  అధికారులకు  ఫిర్యాదు చేయగా వారు ఆలస్యంగా స్పందించారని వారు తెలిపారు.

రూ. 30 లక్షల మేర నష్టం
గ్రామస్తుల ఫిర్యాదుతో మంగళవారం ఎస్‌ఆర్‌బీసీ  ఏఈ రామ్మోహన్‌రెడ్డి, డీఈ చెన్నయ్య  కాలువ మట్టి తరలించిన ప్రదేశాన్ని పరిశీలించారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు మట్టి తోడి తరలించడంతో రూ. 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని  ఏఈ వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.     ఎస్‌ఆర్‌బీసీ   ర్యాంపు మట్టిని ఇతర పనుల నిమిత్తం తోడేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు జరిగిన నష్టాన్ని  రికవరీ చేయాలని గిద్దలూరు గ్రామస్తులు కోరుతున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌