amp pages | Sakshi

అన్ని వర్గాలకు సమన్యాయం

Published on Tue, 04/09/2019 - 15:41

సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపిస్తే పూర్తిగా అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని, అయినప్పటికీ వెరవకుండా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు చేశానని పేర్కొన్నారు. సోంపేట ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ రద్దుకు మూడేళ్లపాటు అవిశ్రాంతంగా పోరాడానన్నారు. 15 రోజుల పాటు శ్రీకాకుళం సబ్‌జైల్లో కూడా ఉన్నానని గుర్తుచేశారు. కిడ్నీరోగులను ఆదుకోవడానికి ఉద్దానం ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి వ్యాధి పీడిత గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ప్లాంట్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సోంపేట ప్రభుత్వాస్పత్రిలో సొంత ఖర్చులతో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు చేశానన్నారు. ఇలా పలు అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.

ప్రశ్న: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు?
జవాబు: ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఒకసారి 2009లో శాసనసభ్యునిగా ఎన్నికై సేవలందించిన అనుభవం ఉంది. అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాటాలు చేశాను. తద్వారా అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన అనుభవం ఉంది.

ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన సమస్యలేమిటి?
జవాబు: నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది. సాగునీటి సమస్య, నిరుద్యోగంతో వలసలు, మౌలిక సౌకర్యాల కల్పన కూడా మిగతా నియోజకవర్గాలతో పోల్చితే తక్కువే. ముఖ్యంగా ఉద్దాన ప్రాంత ప్రజల్ని కిడ్నీవ్యాధి మహమ్మారి ఎందర్నో బలి తీసుకుంటుంది.

ప్రశ్న: సమస్యల పరిష్కారానికి ఎలా కృషిచేస్తారు?
జవాబు: నియోజకవర్గంలో ఉన్న శాశ్వత సమస్యలన్నీ పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తాను. నేను గుర్తించిన ప్రతీ సమస్యపై రానున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతనిచ్చి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాను.

ప్రశ్న: ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వ్యూహం ఏమిటి?
జవాబు: ప్రత్యేకంగా వ్యూహం అంటూ ఏమీ లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫేస్టోలో పేర్కొన్న అంశాలు నా విజయానికి దోహదపడతాయి. అంతకు ముందు నేను చేసిన ప్రజాహిత సేవా కార్యక్రమాలు, నా వ్యక్తిత్వం, విద్యార్హతలు, గడచిన టీడీపీ పాలనలో చోటుచేసుకొన్న అవినీతి కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అవే నన్ను గెలిపిస్తాయి.

ప్రశ్న: మీరు ఎన్నికైతే అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఒకే విధంగా ప్రాధాన్యత ఇస్తారా? 
జవాబు: ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి పరిపాలిస్తాను. వారికి అన్నింటా గౌరవం దక్కేలా వ్యవహరిస్తాను. గడచిన టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.  అటువంటి పరిపాలన నాకు నచ్చదు. అందర్నీ కలుపుకొని పోతాను. మొదటిసారి ఎన్నికైనప్పుడే నా పాలనలో అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇచ్చాననేది రుజువయ్యింది కూడా.

ప్రశ్న: వ్యక్తిగతంగా ఏమైనా సేవాకార్యక్రమాలు చేపట్టారా?
జవాబు: అవును.. నేను పదవితో సంబంధం లేకుండా సొంతంగా ఉద్దానం ఫౌండేషన్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి కిడ్నీబాధిత గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఉచిత మెడికల్‌ క్యాంపులు, ఉచిత అంబులెన్స్‌ సర్వీసులు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మాజీ అయ్యాక కూడా నాకు వచ్చిన గౌరవ వేతనాన్ని పూర్తిగా కిడ్నీబాధితుల కుటుంబాలకు నెలవారీ వారి అకౌంట్లలో వేసి వారికి సాయం చేస్తున్నాను.

రాజకీయ నేపథ్యం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా సాయిరాజ్‌ ఇప్పటికే 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. పదవీ కాలం చివరిలో తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తర్వాత 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగాను, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిశీలకునిగా కూడా సేవలందించారు.
ప్రశ్న:  టీడీపీ పాలనలో పలు ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? 
జవాబు: అవును టీడీపీ పాలనలో ఎంతో మంది అర్హులైన పేదలకు ఇళ్లు, సామాజిక పింఛన్లు రాలేదు. ఇలా చాలా మందికి  ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించలేదు. అటువంటి వారందరికీ పార్టీలకతీతంగా అర్హత ఉన్న మేరకు ప్రాధాన్యమిచ్చి న్యాయం చేస్తాను. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)