amp pages | Sakshi

ముగ్గురు ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు

Published on Tue, 10/13/2015 - 01:58

నిందితుల్లో ఇద్దరు అన్నదమ్ములు
వారిచ్చిన సమాచారంతో కర్ణాటకలో దాడులు
రూ.కోటి విలువైన ఎర్ర దుంగల స్వాధీనం

 
 చిత్తూరు (అర్బన్) : జిల్లాలోని బంగారుపాళ్యం, మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్‌ల పరిధిలోని ఆదివారం పోలీసులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లరు పట్టుబడ్డా రు. వారిలో మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అలియాస్ అల్తాఫ్(36), అన్నదమ్ములు ఎస్.అరుల్(25), ఎస్.శరవణ(22) ఉన్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులిచ్చినసమాచారంతో చిత్తూరు పోలీ సులు కర్ణాటక రాష్ట్రంలో భారీగా ఎర్ర డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీసు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రత్న ఈ మేరకు వివరాలు వెల్లడిం చారు. కర్ణాటక రాష్ట్రం దొడ్లబళ్లాపూర్, కడనూర్ గ్రామంలో అంజాద్ అలియాస్ మున్నాకు చెందిన మామిడి తోటలో సోదాలు నిర్వహించిన పోలీసులు 3 టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. అంజాద్ పారిపోయాడని, దుంగల విలువ రూ.కోటి ఉంటుందని తెలిపారు.

 నిందితుల వివరాలిలా..
 మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు చేసిన పోలీసులు చిత్తూరు నగరంలోని జాన్స్ గార్డెన్‌కు చెందిన మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అలియాస్ అల్తాఫ్‌ను అరెస్టు చేశారని ఓఎస్డీ తెలిపారు. డిగ్రీ వరకు చదువుకున్న ఇతను 2010 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడన్నారు. పేరు మోసిన స్మగ్లర్ షరీఫ్‌కు ముఖ్య అనుచరుడని, ఆంధ్ర రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన పలువురు స్మగ్లర్లతో ఇతనికి పరిచయాలు ఉన్నాయని వెల్లడించారు. అల్తాఫ్‌పై ఇప్పటి వరకు జిల్లాలో ఆరు కేసులున్నాయి. ఇక బంగారుపాళ్యం స్టేషన్ పరిధిలో జరిపిన సోదాల్లో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఉత్తస్‌గారై తాలూకా కీలమత్తూరుకు చెందిన అన్నదమ్ములు ఎస్.అరుల్, ఎస్.శరవణలను పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరూ జేసీబీ డ్రైవర్లుగా పని చేసేవారని, గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పెలైట్‌గా వ్యవహరిస్తున్నారని ఓఎస్డీ వివరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బంగారుపాళ్యం, మదనపల్లె పోలీసుల్ని ఓఎస్డీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
 

Videos

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)