టీడీపీ మద్యం ధ్వంసం
Breaking News
197వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Published on Sat, 06/23/2018 - 20:20
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 197వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ములికిపల్లి శివారు నుంచి నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కడలి, వేగివారి పాలెం క్రాస్, గెద్దాడ మీదుగా మొగలికుదురు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.
అనంతరం వైఎస్ జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి తాటిపాక మీదుగా నగరం వరకూ 197వ రోజు పాదయాత్ర సాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వర్షం కారణంగా ప్రజాసంకల్పయాత్ర శనివారం (196వ రోజు) మార్నింగ్ సెషన్ రద్దయింది. వర్షం ఆగిన అనంతరం వైఎస్ జగన్ చింతలపల్లి నుంచి జననేత పాదయాత్రను ప్రారంచారు. అక్కడి నుంచి కూనవరం మీదుగా ములికిపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. జననేత వైఎస్ జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు.
Tags