amp pages | Sakshi

మావోల కోసం వేట

Published on Fri, 02/01/2019 - 08:13

తూర్పుగోదావరి , చింతూరు (రంపచోడవరం): సరిహద్దుల్లో తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టుల కోసం వేట మొదలైంది. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రభావం పెంచుకుంటున్న మావోయిస్టుల జాడ కోసం ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. రెండు రోజుల క్రితం విలీన మండలాల్లో మావోయిస్టులు ఆర్టీసీ బస్సు, లారీని దహనం చేసిన నేపథ్యంలో మన్యంలో ఒక్కసారిగా అలజడి రేగింది. దీంతో జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటించి బలగాలను అప్రమత్తం చేశారు. మావోయిస్టులను కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో కూంబింగ్‌ ముమ్మరం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఘటనలకు పాల్పడింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు దళ సభ్యులైనా ఆ ప్రభావం విలీన మండలాలపై పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ఓవైపు మావోయిస్టుల కార్యకలాపాలు, మరోవైపు ప్రత్యేక బలగాల కూంబింగ్‌తో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో హై అలర్ట్‌ వాతావరణం నెలకొంది.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ సమాధాన్, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో పాటు గురువారం మావోయిస్టులు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిని పురస్కరించుకుని మావోయిస్టులు అటు ఛత్తీస్‌గఢ్‌లో పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడడంతో పాటు ఇటీవల చింతూరు మండలం పేగలో ఓ వ్యానును, సరివెల వద్ద జాతీయ రహదారిపై తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీని దగ్ధం చేశారు.

కుంట ఏరియా కమిటీ పనేనా?
ఈ రెండు ఘటనలు మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు పోలీసులు భావిస్తున్నారు. గతంలో విలీన మండలాల్లో మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్‌ నగేష్‌ ఎన్‌కౌంటర్‌ అనంతరం రూపు మార్చుకుని చర్ల, శబరి ఏరియా కమిటీగా అవతరించింది. ఈ కమిటీకి కొంతకాలం రజిత, సునీల్‌లు కార్యదర్శులుగా వ్యవహరించారు. అనంతరం సునీల్‌ పోలీసులకు లొంగిపోడంతో ఈ కమిటీ బాధ్యతలను భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్‌ గోదావరి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలోనే పర్యవేక్షిస్తూ ఈ కమిటీకి శారదక్కను కార్యదర్శిగా నియమించినట్టు తెలిసింది. కాగా శబరి లోకల్‌ ఆర్గనైజేషన్‌ స్క్వాడ్‌(ఎల్‌వోఎస్‌)కు సోమ్‌డాను కమాండర్‌గా నియమించినట్టు సమాచారం. చర్ల, శబరి ఏరియా కమిటీ ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల కార్యకలాపాలను శబరి ఎల్‌వోఎస్, కుంట ఏరియా కమిటీకి అప్పగించినట్లుగా సమాచారం.

సరిహద్దుల్లో జాయింట్‌ ఆపరేషన్‌
బస్సు, లారీ దగ్థం ఘటన అనంతరం ప్రత్యేక బలగాలతో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆంధ్రాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా, ఎస్టీఎఫ్, డీఎఫ్, సీఏఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఘటనలకు పాల్పడుతున్న మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో తలదాచుకునే అవకాశమున్న నేపధ్యంలో సరిహద్దుల్లోని మల్లంపేట, నర్శింగపేట, నారకొండ, అల్లిగూడెం, దొంగల జగ్గారం, దుర్మా, మైతా, సింగారం, బండ ప్రాంతాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. అటు పోలీసుల జాయింట్‌ ఆపరేషన్, ఇటు మావోయిస్టుల ఆధిపత్య పోరు నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సరిహద్దు పల్లెల ఆదివాసీల్లో ఆందోళన నెలకొంది. మావోయిస్టుల బంద్‌ కారణంగా రెండోరోజు కూడా విలీన మండలాలకు బస్సులు బంద్‌ అయ్యాయి. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)